13
June, 2026

A News 365Times Venture

13
Saturday
June, 2026

A News 365Times Venture

KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!

Date:

KTR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు అభివృద్ధి, సంక్షేమానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ ప్రస్తుతం సంక్షోభంలోకి నెట్టబడిందని అన్నారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో పాటలు రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ అనేక పాత్రలు పోషించారని, తెలంగాణ సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేశారని పేర్కొన్నారు. “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అనే నినాదంతో ముందుకు సాగి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. కేసీఆర్ జీవిత గాథపై సినిమా తీయాలని ఒక దర్శకుడు తనను కలిసిన సందర్భాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన తర్వాత ఆలోచిద్దామని కేసీఆర్ చెప్పారని, తెలంగాణ ఆవిర్భావం అనేది అన్ని ప్రతికూల పరిస్థితులను ఛేదించి సాధించిన చారిత్రక విజయమని ఆ దర్శకుడు అభిప్రాయపడ్డారని తెలిపారు. కేసీఆర్ అనే మూడు అక్షరాల ముందు “ముఖ్యమంత్రి” అనే పదవి చాలా చిన్నదిగా కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించినట్లు చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్.. “పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది. నిష్ఫల తెలంగాణగా మారిపోయింది” అని విమర్శించారు. తెలంగాణ సాధన కోసం పదవిని మాత్రమే కాదు.. అవసరమైతే ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడిన ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించి వేలాది కుటుంబాల కష్టాలను తీర్చిన నాయకుడు కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొందరు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని ఆరోపించారు.

రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే విజయం సాధించిందని, 2023 ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తూ, ప్రస్తుతం రాష్ట్రాన్ని వెనక్కి నెట్టే విధంగా పాలన సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ.. గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక, పరిపాలనా వ్యవస్థలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. “వడ్డించిన విస్తరి లాంటి తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిగా మార్చుతున్నారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్ అన్నారు. అయితే ఈ పరిస్థితులు శాశ్వతం కాదని, 2028 డిసెంబర్‌లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അഭിഭാഷകന്റെ പരാതി; യൂട്യൂബര്‍ തൊപ്പിക്കും സംഘത്തിനുമെതിരെ അന്വേഷണത്തിന് ഉത്തരവിട്ട് ഡി.ജി.പി

കൊച്ചി: യൂട്യൂബര്‍ തൊപ്പി എന്ന നിഹാദിനും സംഘത്തിനുമെതിരെ താന്‍ നല്‍കിയ പരാതിയില്‍...

தர்மஸ்தலா கோயில் விவகாரம்: `இரண்டு நாள்களில் நானே நேரில் சொல்கிறேன்' – நடிகர் பிரகாஷ் ராஜ் விளக்கம்!

கர்நாடகா தட்சிண கன்னடா மாவட்டத்தில் உள்ளது தர்மஸ்தலா மஞ்சுநாத சுவாமி கோயில்....

Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి

టూర్‌కు వెళ్దాం అంటే ఆ పిల్లలు సంతోషంతో తండ్రి వెంట వెళ్లారు....

ಬಿಡದಿ ಟೌನ್​ ಶಿಪ್​​​ ಗೆ​ ಅಂತಿಮ ಅಧಿಸೂಚನೆ ಪ್ರಕಟಿಸಿದ ಸರ್ಕಾರ

ಬೆಂಗಳೂರು, ಜೂನ್, 12,2026 (www.justkannada.in): ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು  ಬಿಡದಿ ಟೌನ್...