2
July, 2026

A News 365Times Venture

2
Thursday
July, 2026

A News 365Times Venture

YS Jagan: పీఎస్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Date:

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో చట్టవ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. గతంలో రాష్ట్ర అభివృద్ధిపై చర్చ జరిగేదని, ఇప్పుడు మాత్రం “రెడ్‌బుక్ రాజ్యాంగం”, పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న లాకప్ మరణాలపై చర్చ జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారి గొంతులు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విభేదించే స్వరాలను అణచివేస్తున్నారని జగన్ ఆరోపించారు. విజయవాడ సాయికృష్ణ కేసు, క్రాంతికుమార్ ఆత్మహత్య, కర్నూలు గంగమ్మ ఘటన వంటి సంఘటనలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు.

సాయికృష్ణ కేసును ప్రస్తావిస్తూ, కస్టడీలో ఒక వ్యక్తిని హింసించి హత్య చేసి, ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు కనీసం అస్థికలు కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైన తర్వాత ప్రభుత్వం వైఖరి మార్చుకుందని, తొలుత బాధితుడిని రౌడీషీటర్‌గా చిత్రీకరించి, తర్వాత కుటుంబాన్ని పిలిచి న్యాయం చేస్తామని చెప్పడం విరుద్ధ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం అమలు కావడం లేదని, బాధితులకు మద్దతు తెలిపిన వారిపైనా విమర్శలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ చర్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

 

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

15 തവണ ജനപ്രതിനിധിയായവളെ തോല്‍പ്പിച്ച് ഫലസ്തീന്‍ അനുകൂല കുടിയേറ്റക്കാരി; കൊളറാഡോയില്‍ വന്‍ അട്ടിമറി

  കൊളറാഡോ: അമേരിക്കന്‍ രാഷ്ട്രീയത്തെ അമ്പരപ്പിച്ചുകൊണ്ട് കൊളറാഡോയിലെ ഡെമോക്രാറ്റിക് പ്രൈമറി തെരഞ്ഞെടുപ്പില്‍...

"தவெக செய்வது Horse Trading அல்ல, Horse Racing" – பிரவீன் சக்கரவர்த்தி விளக்கம்

கோவை விமான நிலையத்தில் காங்கிரஸ் கட்சியின் மாநிலங்களவை உறுப்பினர் பிரவீன் சக்கரவர்த்தி...

Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!

Rythu Bharosa 3rd Installment Released Today: తెలంగాణ ప్రభుత్వం ‘రైతు...

ಸಚಿವ ಯತೀಂದ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರ ಸಚಿವಾಲಯದ ಕಚೇರಿ ಉದ್ಘಾಟನೆ

ಬೆಂಗಳೂರು, ಜುಲೈ,2,2026 (www.justkannada.in):  ನಗರಾಭಿವೃದ್ಧಿ ಸಚಿವ  ಡಾ. ಯತೀಂದ್ರ ಸಿದ್ದರಾಮಯ್ಯ...