16
August, 2026

A News 365Times Venture

16
Sunday
August, 2026

A News 365Times Venture

Amit Shah: ‘‘దేశ ప్రజలు మీ పాపాలను క్షమించరు’’.. సోనియాగాంధీపై అమిత్ షా ఫైర్..

Date:

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘వందేమాతరం’ గీతం ఆలపిస్తుండగా సోనియాగాంధీ పాట ఆపమని కోరారని అన్నారు. ఈ పాపానికి దేశ ప్రజలు సోనియాగాంధీని ఎన్నటిక క్షమించరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 ఏళ్ల తర్వాత కూడా బంకింబాబు రచించిన ఈ అమర గీతానికి మళ్లీ గౌరవం లభిస్తుంటే, అది సోనియాగాంధీకి నచ్చడం లేదని అన్నారు. సోనియా గాంధీ చేసిన పనిని 140 కోట్ల మంది ప్రజలు చూశారని, ఈ పాపానికి ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ క్షమించరని అన్నారు.

‘‘వందేమాతరాన్ని అసంపూర్తిగా వదిలేయాలని ఎవరైనా ఎలా కలగంటారు? కాంగ్రెస్ వాళ్లు సిగ్గుపడాలి వారిలో ఇంకా ఏమైనా సిగ్గు మిగిలి ఉంటే, బంకిం బాబు అమరాత్మకు, దేశ ప్రజలకు చేతులు జోడించి క్షమాపణ చెప్పాలి’’ అని అన్నారు. ఓటు బ్యాంక్ దురాశతో కాంగ్రెస్ వందేమాతరాన్ని మరిచిపోయిందని అమిత్ షా అన్నారు. ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్రమోడీ ఈ గీతానికి పునర్జీవం పోశారని అన్నారు. ఆదివారం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా, అమిత్ షా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మతో కలిసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

തങ്ങളുടെ പ്രവർത്തകന്റെ പിതാവ് ബി.ജെ.പി ആക്രമണത്തിൽ കൊല്ലപ്പെട്ട സംഭവത്തിൽ നിഷ്പക്ഷ അന്വേഷണവും അറസ്റ്റും വേണമെന്ന് സി.ജെ.പി

ന്യൂദൽഹി: പശ്ചിമ ബംഗാളിൽ തങ്ങളുടെ പ്രവർത്തകന്റെ പിതാവ് കൊല്ലപ്പെടാനിടയായ ആക്രമണത്തിന് ഉത്തരവാദികളായവരെ...

ஆசிரியர்களின் கல்விச் சான்றிதழ்கள் உண்மைத் தன்மை அறிதல்: பள்ளிக் கல்வித் துறை உத்தரவு!

அரசு தொடக்க, நடுநிலை, அரசு நகராட்சி மற்றும் மாநகராட்சி, அரசு நிதியுதவி...

கர்நாடக வனத்துறை தூப்பாக்கிச் சூடு: "காரணமானவர்கள் தண்டிக்கப்பட வேண்டும்!" – மு.க. ஸ்டாலின்

கர்நாடக மாநிலம், சாமராஜநகர் மாவட்டத்தில் உள்ள ஹனூர் அருகில், காவிரி வனவிலங்கு...