29
July, 2026

A News 365Times Venture

29
Wednesday
July, 2026

A News 365Times Venture

Mega DSC: ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్!

Date:

మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ యువజన, విద్యార్థి విభాగాలు భారీ నిరసన ర్యాలీలు నిర్వహించాయి. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. కాకినాడ, గుంటూరు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాకినాడలో నిర్వహించిన ర్యాలీలో మెగా డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని వైసీపీ నాయకులు ప్రశ్నించారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ నినాదాలు చేశారు. గుంటూరులో శంకర్ విలాస్ నుంచి లాడ్జి సెంటర్ వరకు వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్ర వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూడా బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని, నకిలీ సర్టిఫికెట్లు వినియోగించారని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరపాలని కోరారు. తనపై కేసులు పెట్టినా భయపడబోమని స్పష్టం చేశారు.

అనంతపురంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో కూడా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఏలూరులో వైసీపీ రాష్ట్ర యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. “మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ” అంటూ నినాదాలు చేస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళంలో జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని, డీఎస్సీ పోస్టుల భర్తీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర యువజన విభాగం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమాల ద్వారా డీఎస్సీ నియామకాలపై సీబీఐతో విచారణ జరిపించాలని.. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ತಮಿಳುನಾಡಿಗೆ ನೀರು ಬಿಟ್ಟರೇ ಬೀದಿಗಿಳಿದು ಹೋರಾಟ- ಶಾಸಕ ದರ್ಶನ್ ಪುಟ್ಟಣ್ಣಯ್ಯ ಎಚ್ಚರಿಕೆ

ಮಂಡ್ಯ,ಜುಲೈ,29,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಕುಡಿಯುವ ನೀರಿಗೂ ಕೊರತೆ ಇದ್ದರೂ ತಮಿಳುನಾಡಿಗೆ...

പെണ്‍കുട്ടികള്‍ എന്ന് ഞാന്‍ പറഞ്ഞിട്ടില്ല: മക്കള്‍ക്ക് പകര്‍ന്ന് കൊടുക്കണം എന്നാണ് പറഞ്ഞത്, ഇതില്‍ എന്ത് സ്ത്രീ വിരുദ്ധത: വിശദീകരണവുമായി മുഖ്യമന്ത്രി

തിരുവനന്തപുരം: പാചകവുമായി ബന്ധപ്പെട്ട് താന്‍ സ്ത്രീവിരുദ്ധമായ പരമാര്‍ശം നടത്തിയിട്ടില്ലെന്ന് മുഖ്യമന്ത്രി വി.ഡി...

அமெரிக்க தளத்தில் ஈரான் தாக்குதல், ட்ரம்ப்-நெதன்யாகு, ஜெலன்ஸ்கி மீட், ஈராக் தாக்குதல் ஏன்?|#AllInOne

ஈரான் போர், அதிபர்கள் சந்திப்பு உள்ளிட்ட முக்கிய உலக செய்திகளை இங்கே...

ತಮಿಳುನಾಡಿಗೆ ನೀರು ಹರಿಸುವಂತೆ ಆದೇಶ: ಈಗ ಸಂಕಷ್ಟ ಸೂತ್ರ ಪಾಲನೆ ಆಗಬೇಕಾಗುತ್ತೆ- ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್

ಬೆಂಗಳೂರು,ಜುಲೈ,29,2026 (www.justkannada.in):  ತಮಿಳುನಾಡಿಗೆ ಪ್ರತಿನಿತ್ಯ 3500 ಕ್ಯೂಸೆಕ್ಸ್  ನೀರು ಹರಿಸುವಂತೆ...