22
July, 2026

A News 365Times Venture

22
Wednesday
July, 2026

A News 365Times Venture

KTR: ‘రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి’..

Date:

KTR: తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బాన్సువాడలో మరోసారి గులాబీ జెండా ఎగరేసే సమయం వచ్చిందని ఆయన అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున గెలిచి పార్టీ మారారని, ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి కూడా బాగోలేదని ఆయనకు అర్థమైందన్నారు. “కుడితిలో పడిన ఎలుకలా పోచారం పరిస్థితి తయారైంది. ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా ఆయన ఓడిపోవడం ఖాయం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

“ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పార్టీ మారను” అని చెప్పిన పోచారం చివరకు మాట తప్పి పార్టీ మారారని ఆరోపించారు. స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు తాను ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకునే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు. పోచారం తన రాజకీయ భవిష్యత్తును తానే సమాధి చేసుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయకుండా చేతులెత్తేశారని ఆరోపించారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి కూడా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏ సభ పెట్టినా కేసీఆర్‌ను విమర్శించడమే సీఎం పనిగా మారిందన్నారు.

రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ అన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, షాపుల్లో ఎరువుల సంచులు లేకపోతే యాప్‌లో కనిపించినా ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీకి పంపేందుకు సంచులు ఉంటున్నాయని, కానీ రైతులకు మాత్రం అందడం లేదని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా కేటీఆర్ స్పందించారు. రెండు పిల్లర్లు కుంగి 31 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు మరమ్మతులు ఎందుకు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కన్నెపల్లి నుంచి ప్రతిరోజూ నీరు కిందకు వెళ్తున్నా పంపింగ్ చేయడం లేదన్నారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌కు వెళ్తే ప్రభుత్వం మాత్రం “కోల్డ్ స్టోరేజ్”లోకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం అవసరమైతే రక్తమే కాదు ప్రాణాలు కూడా ఇస్తామని బీఆర్ఎస్ ఎప్పుడూ చెప్పిందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കറുത്ത വസ്ത്രം ധരിച്ച് പ്രതിപക്ഷ പ്രതിഷേധം; പാര്‍മെന്റ് ഇന്നും പ്രക്ഷുബ്ധം: സഭ നിര്‍ത്തിവെച്ചു

ന്യൂദല്‍ഹി: പാര്‍ലമെന്റിലെ വര്‍ഷകാല സമ്മേളനത്തിന്റെ രണ്ടാം ദിവസവും പ്രതിപക്ഷ പ്രതിഷേധം. സി.ജെ.പി...

அடிப்படை வசதிகளற்ற குன்னவயல் ஊராட்சி ஒன்றிய தொடக்கப்பள்ளி; 15 ஆண்டுகளாகத் தொடரும் அவலம்!

புதுக்கோட்டை மாவட்டம், 9-ஏ நத்தம்பண்ணை ஊராட்சிக்கு உட்பட்ட குன்னவயல் கிராமத்தில் 15...

Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్‌ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?

Crude Oil Prices: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం...

ಸರ್ಕಾರಿ ಪ್ರತಿನಿಧಿಗಳ ಮೇಲೆ ಹಲ್ಲೆ ಮಾಡಿದ ಯಾರನ್ನೂ ಸಹ ಬಿಡುವುದಿಲ್ಲ- ಸಚಿವ ಕೃಷ್ಣಭೈರೇಗೌಡ

ಬೆಂಗಳೂರು,ಜುಲೈ,21,2026 (www.justkannada.in): ಸರ್ಕಾರಿ ಪ್ರತಿನಿಧಿಗಳ ಮೇಲೆ ಹಲ್ಲೆ ನಡೆಸುವುದು ಕಾನೂನಿನ...