28
August, 2026

A News 365Times Venture

28
Friday
August, 2026

A News 365Times Venture

WPL 2026 Final : విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. స్మృతి మంధాన ఊచకోత.!

Date:

వడోదర వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి, రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను సగర్వంగా ముద్దాడింది. గురువారం జరిగిన ఈ ఉత్కంఠభరిత తుది పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆర్‌సీబీ, గతేడాది సాధించిన విజయం యాదృచ్ఛికం కాదని నిరూపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఢిల్లీ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ కేవలం 37 బంతుల్లోనే 57 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు పటిష్టమైన పునాది వేయగా, ఆమెకు తోడుగా లారా వోల్వార్డ్ 44 పరుగులు, చినెల్ హెన్రీ మెరుపు వేగంతో 35 పరుగులు జోడించడంతో ఢిల్లీ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఆర్‌సీబీ బౌలర్లలో అరుంధతి, సత్ఘరే , నడైన్ డిక్లార్క్ క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఒక్కో వికెట్ పడగొట్టారు.

Story Board : స్మార్ట్ ఫోన్ ఉంటే.. వ్యక్తిగత గోప్యత డొల్లేనా? WhatsAppకు సుప్రీం వార్నింగ్

అయితే, 204 పరుగుల సునాయాసంగా లేని లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఆరంభంలోనే గ్రేస్ హ్యారిస్ వికెట్ కోల్పోవడంతో కొంత ఆందోళన కలిగింది. కానీ, ఆ దశలో కెప్టెన్ స్మృతి మంధాన , జార్జియా వోల్ కలిసి విధ్వంసాన్ని సృష్టించారు. స్మృతి మంధాన కేవలం 41 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్ల ఆశలను నీరుగార్చగా, మరోవైపు జార్జియా వోల్ 53 బంతుల్లో 79 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేసింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 165 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. మైదానంలోని ప్రతి మూలకు బౌండరీల వర్షం కురిపిస్తూ వడోదర స్టేడియాన్ని హోరెత్తించారు.

మ్యాచ్ ముగింపు దశలో వోల్, రిచా ఘోష్ , మంధాన వికెట్లు వరుసగా కోల్పోవడంతో ఢిల్లీ మళ్ళీ పోరాటంలోకి వచ్చినట్టు అనిపించినా, అదృష్టం మాత్రం ఆర్‌సీబీ పక్షానే నిలిచింది. ముఖ్యంగా 19వ ఓవర్‌లో మిన్ను మణి ఒక సులభమైన క్యాచ్‌ను చేజార్చడం ఢిల్లీ విజయవకాశాలను పూర్తిగా దెబ్బతీసింది. ఆఖరి ఓవర్‌లో ఆర్‌సీబీకి విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా, ఒత్తిడిని అధిగమించిన రాధా యాదవ్ వరుసగా రెండు అద్భుతమైన ఫోర్లు బాది 19.4 ఓవర్లలోనే జట్టును విజేతగా నిలిపింది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా మిగిలిపోవాల్సి రావడం గమనార్హం. ఆర్‌సీబీ తన నిలకడైన ఆటతీరుతో మరోసారి ట్రోఫీని కైవసం చేసుకుని తన అభిమానులకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాన్ని మిగిల్చింది.

Amazon Alert : రూ. 25 వేలకే బ్రాండెడ్ ఏసీలు.. సమ్మర్ కోసం భారీ ఆఫర్లు.!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಸಂಪುಟದಲ್ಲಿ ಬದಲಾವಣೆ ವಿಚಾರ ತಳ್ಳಿಹಾಕಿದ AICC ಅಧ್ಯಕ್ಷ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ

ಕಲಬುರುಗಿ,ಆಗಸ್ಟ್,27,2026 (www.justkannada.in): ಸಚಿವ ಸ್ಥಾನಕ್ಕೆ ಬಿ.ನಾಗೇಂದ್ರ ರಾಜೀನಾಮೆ ನೀಡುವ ಸಾಧ್ಯತೆ...

ഒരു സുകുമാരക്കുറുപ്പല്ല, ഇതിപ്പോള്‍ കുറേയുണ്ട്; ഇത്‌ സോഷ്യല്‍ മീഡിയയില്‍ പ്രത്യക്ഷപ്പെട്ട സുകുമാരക്കുറുപ്പുമാര്‍

കൊച്ചി: പിടികിട്ടാപ്പുള്ളി സുകുമാരക്കുറുപ്പിനെ ബ്രൂണെയില്‍ കണ്ടെത്തിയതായി മലയാളം ടെലിവിഷന്‍ ചാനലുകള്‍ റിപ്പോര്‍ട്ട്...

'திமுக அரசு மதவாதிகளுடன் கரம் கோர்த்து அனைத்துச் சாதி அர்ச்சகர் திட்டத்தை முடக்கியது!- ஆதவ் ஆவேசம்!

சமூகநீத்துறையின் மீதான மானியக் கோரிக்கை விவாதம் சட்டமன்றத்தில் இன்று நடந்திருந்தது. இந்த...

OTR: నిజామాబాద్ కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!

OTR: ఆ జిల్లాకు ఆయనే పెద్ద దిక్కు.. మంత్రి కానీ మంత్రి....