20
August, 2026

A News 365Times Venture

20
Thursday
August, 2026

A News 365Times Venture

Bandi Sanjay: కాంగ్రెస్ నాయకులలో హిందూ రక్తం లేదా?.. ఈ అంశాలను ఎందుకు ప్రశ్నించరు?

Date:

ఛావా సినిమాని అందరూ తప్పకుండా చూడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.. నూతన విద్యావిధానాన్ని తీసుకువస్తే తెలంగాణలో అమలుకు నోచుకోవడం లేదన్నారు.. కరీంనగర్ జిల్లా కేంద్రంలో‌ ఉపాధ్యాయుల ఆత్మీయ‌ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. “తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులది బిచ్చపు బతుకు‌ అయ్యింది. దీనికి కారణం బీఆర్ఎస్, కాంగ్రెస్. అన్ని బిల్లులు‌ పెండింగ్‌లో పెట్టి హరిగోస పెడుతున్నారు. మీ కోసం కొట్లాడుతున్నది బీజేపీ పార్టీ ‌మాత్రమే. పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. TNGO నాయకులని‌ బెదిరించిన చరిత్ర కేసీఆర్‌ది. పీఆర్సీ అమలుకు, డీఏ‌లు ఇవ్వడానికి పైసలు లేని పరిస్థితి ప్రభుత్వంది. కాంగ్రెస్ లో బడా కాంట్రాక్టర్ లే మంత్రులు. కమిషన్లు ఇస్తేనే బిల్లులు వస్తాయి. 317 జీవో కోసం కొట్లాడింది మేమే. మీ కోసం ‌మేము కొట్లాడితే ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కి ఓటు వేశారు.” అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

READ MORE: Health Tips: జొన్నల్లో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు

“కులగణన చేసి ముస్లింలని తీసుకువచ్చి బీసీలలో కలిపారు. రాబోయే రోజులలో ఎవరి సమాజం వస్తదో ఆలోచించండి. కులగణన లో జనాభాని కావాలని తగ్గించి చూపారు. బీసీలకి కాంగ్రెస్ పార్టీ‌ ఇచ్చేది 32% మాత్రమే.. మిగితాది ముస్లింలకే దక్కుతుంది. ముస్లింలని తీసుకువచ్చి బీసీలలో కలపడం ఏమిటి? రంజాన్ కి ముస్లింలకి వెసులుబాటు ఇచ్చారు.. కాని అయ్యప్ప, హనుమాన్, దుర్గ దీక్షా పరులకి‌ ఎందుకు వెసులుబాటు‌ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ నాయకులలో హిందుత్వరక్తం లేదా? ఎందుకు‌ ప్రశ్నించడం లేదు.” అని బండి సంజయ్ ప్రశ్నించారు.

READ MORE: Hyundai : విద్యా రంగానికి రూ.3.38కోట్లు ఖర్చు చేస్తున్న హ్యుందాయ్

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മഹാത്മാ ഗാന്ധിയുടെ കുടുംബം സി.ജെ.പിക്കൊപ്പം നിൽക്കുന്നു; അത് തങ്ങളുടെ രാജ്യസ്നേഹത്തിനുള്ള ഒരു സർട്ടിഫിക്കറ്റെന്ന് അഭിജീത് ദീപ്കെ

ഛത്രപതി സംഭാജി നഗർ: മഹാത്മാഗാന്ധിയുടെ കുടുംബം തങ്ങൾക്കൊപ്പം നിൽക്കുന്നുവെന്നത് തങ്ങളുടെ രാജ്യസ്നേഹത്തിനുള്ള...

'சீட் கேட்ட பிரபல சினிமா இயக்குநர்; உடனே மறுத்த முதல்வர் விஜய்!' – அமைச்சர் ஆனந்த் பகிரும் ரகசியம்

சட்டமன்றத்தில் இன்று நீர்வளத்துறையின் மானியக் கோரிக்கையின் மீதான விவாதம் நடந்தது. மானியக்...

Bihar: AK-47 ఘటనపై నిరసన.. పోలీసుల అదుపులో తేజస్వీ యాదవ్..

Bihar: బీహార్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాట్నాలో ఆర్జేడీ నిర్వహించిన రాజ్‌భవన్...

ಯೂಟ್ಯೂಬರ್‌ ಗಳಿಗೂ ಪೊಲೀಸ್‌ ನಿಗಾ?  ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮಕ್ಕೆ ಕಮಿಷನರ್ ಸೀಮಾ ಲಾಟ್ಕರ್ ಖಡಕ್ ಎಚ್ಚರಿಕೆ

ಮೈಸೂರು,ಆಗಸ್ಟ್,19,2026 (www.justkannada.in):  ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮದ ಮೂಲಕ ಕ್ಷಣಾರ್ಧದಲ್ಲಿ ಲಕ್ಷಾಂತರ ಜನರನ್ನು...