19
March, 2025

A News 365Times Venture

19
Wednesday
March, 2025

A News 365Times Venture

Delhi New CM: ఢిల్లీ సీఎం ఎంపికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!

Date:

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఫలితాలు వచ్చి 6 రోజులు అవుతున్నా.. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. దీంతో ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అయితే ప్రధాని మోడీ ప్రస్తుతం భారత్‌లో లేరు. రెండు దేశాల పర్యటన కోసం సోమవారం ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లారు. దీంతో ఢిల్లీ సీఎం ఎంపిక వాయిదా పడింది. ప్రస్తుతం మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన ముగించుకుని ఈ వారమే ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 16) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహిస్తోంది. దీని కోసం ఇద్దరు బీజేపీ సీనియర్ నాయకులను పంపించనుంది. ఈ సమావేశంలో తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చనున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పోస్టుతో పాటు రెండు డిప్యూటీ సీఎం పోస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Rangareddy: రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉద్రిక్తత.. న్యాయమూర్తిపై చెప్పు విసిరిన ముద్దాయి!

ఇక ముఖ్యమంత్రిగా మహిళలకు ఛాన్స్ ఇవ్వొచ్చన్న వార్తలు కూడా వినిపిస్తు్న్నాయి. అంతేకాకుండా అందులో దళితులకు అవకాశం ఉండొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సీఎం ఎంపికపై బీజేపీ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. ఇక కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి రాజకీయ ఉద్దండులంతా ఓడిపోయారు. అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి అతి కష్టం మీద గట్టెక్కింది.

ఇది కూడా చదవండి: Kannappa: ‘కన్నప్ప’ కి ప్రభాస్ పారితోషికం తీసుకోవడం లేదా..!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നിയമവിരുദ്ധമായി പ്രവര്‍ത്തിക്കുന്നെന്ന് ആരോപിച്ച് ഉത്തരാഖണ്ഡിലെ 84 മദ്രസകള്‍ അടച്ചുപൂട്ടി ബി.ജെ.പി സര്‍ക്കാര്‍

ഡെറാഡൂണ്‍: നിയമവിരുദ്ധമായി പ്രവര്‍ത്തിക്കുന്നുവെന്ന് ആരോപിച്ച് ഉത്തരാഖണ്ഡിലെ 84 മദ്രസകള്‍ അടച്ചുപൂട്ടി ബി.ജെ.പി...

`ஊதியம் கிடையாது' – போராட்டம் அறிவித்த அரசு ஊழியர்களுக்கு, தமிழ்நாடு அரசு எச்சரிக்கை

பழைய ஓய்வூதிய திட்டத்தை மீண்டும் அமல்படுத்த வேண்டும், பகுதி நேர ஆசிரியர்கள்...

Atreyapuram Pootharekulu: ఆత్రేయపురం కల్తీ నెయ్యి ఘటన.. ల్యాబ్ పరిశీలనలో వెలుగులోకి కీలక వాస్తవాలు!

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని కొన్ని పూతరేకుల దుకాణాల్లో వాడింది కల్తీ...

ತಲೆಯಲ್ಲಿ ಕೂದಲಿಲ್ಲ ಎಂದು ಪತ್ನಿಯಿಂದ ನಿಂದನೆ: ಪತಿ ಆತ್ಮಹತ್ಯೆಗೆ ಶರಣು

ಚಾಮರಾಜನಗರ,ಮಾರ್ಚ್,17,2025 (www.justkannada.in): ತಲೆಯಲ್ಲಿ ಕೂದಲಿಲ್ಲ ಎಂದು ಪತ್ನಿ  ನಿಂದಿಸಿದ್ದಕ್ಕೆ  ಪತಿ...