14
February, 2025

A News 365Times Venture

14
Friday
February, 2025

A News 365Times Venture

PM Modi Big Gifts For Bihar: త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్కు బడ్జెట్లో వరాల జల్లు..

Date:

PM Modi Big Gifts For Bihar: ప్రస్తుత బడ్జెట్‌లో ఎన్డీయే మిత్రపక్ష రాష్ట్రమైన బీహార్‌కు నరేంద్ర మోడీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులను సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మఖానా ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికే రాష్ట్రంలో ప్రత్యేక మఖానా బోర్డును ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొనింది. అంతేకాదు మఖానా పండించే రైతులకు సాంకేతిక, ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ నిర్ణయంతో రైతుల ఆదాయం భారీగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: Kriti Sanon : ఐరన్ లేడీతో జతకడుతూ బిగ్ రిస్కే చేస్తున్న ధనుష్..

అయితే, బీహార్ రాష్ట్రంలోని రైతులు చాలా కాలంగా మఖానాను పండిస్తున్నారు. దీని ఉత్పత్తిలో బీహార్ దేశంలోనే అతి పెద్ద కేంద్రంగా కొనసాగుతుంది. దేశంలో 90 శాతం మఖానా కేవలం బీహార్‌లోనే ఉత్పత్తి చేస్తున్నారు. నార్త్ బీహార్ ప్రాంతంలో అధికంగా ఈ మఖనాను పండిస్తారు. కానీ, దీన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో మఖానా పరిశ్రమకు మరింత ఊతమిచ్చినట్లైంది. అలాగే, రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పాటు ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ గిఫ్ట్‌ ఇచ్చిందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kishan Reddy: మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలకు కేంద్రమంత్రి సవాల్!

మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...

ಹೂಡಿಕೆದಾರರ ಸಮಾವೇಶ: ಉತ್ಸಾಹದಿಂದ ಓಡಾಡಿದ ಎಂ ಬಿ ಪಾಟೀಲ

ಬೆಂಗಳೂರು, Feb.12,2025: ಜಾಗತಿಕ ಹೂಡಿಕೆದಾರರ ಸಮಾವೇಶದಲ್ಲಿ ಬುಧವಾರ ದಿನವಿಡೀ ಬೃಹತ್...

മലയോര ഹൈവേ; 250 കി.മീ പണി പൂര്‍ത്തിയായി, ഒരു വര്‍ഷത്തിനകം 200 കി.മീ കൂടി; ആദ്യ റീച്ചിന്റെ ഉദ്ഘാടനം നാളെ

തിരുവനന്തപുരം: കാസര്‍ഗോഡ് ജില്ലയിലെ നന്ദാരപ്പടവ് മുതല്‍ തിരുവനന്തപുരം ജില്ലയിലെ പാറശ്ശാലവരെ നീളുന്ന...

`மனைவி கணவரை தவிர்த்து வேறொருவர் மீது காதலும், நெருக்கமும் கொண்டிருப்பது தகாத உறவாகாது'- MP ஹைகோர்ட்

மத்தியப் பிரதேசத்தைச் சேர்ந்த ஒருவர் தன்னுடைய மனைவிக்கு வேறு ஒருவருடன் தொடர்பு...