5
May, 2026

A News 365Times Venture

5
Tuesday
May, 2026

A News 365Times Venture

CM Chandrababu: ఎంపీలతో సీఎం సమావేశం.. విభజన సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై సూచనలు!

Date:

నేడు అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సుమారు రెండు గంటల పాటు జరిగింది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు కావడంతో ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎంపీలు పార్లమెంట్‌లో తమ స్వరం వినిపించాలని చంద్రబాబు అన్నారు. కేంద్రం నుంచి అదనపు నిధులు తేవడంపై దృష్టి పెట్టాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల రాష్ట్రానికి అదనపు ప్రయోజనాలు రావాలన్నారు సీఎం.

పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ సమస్యలు, ఆర్ధిక పరిస్థితిపై అవకాశం ఉన్నప్పుడు ప్రతిసారి మాట్లాడాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. మంత్రులతో రాష్ట్ర సమస్యలను, ఇతర అంశాలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. విభజన సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఎంపీలకు సీఎం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు ఢిల్లీ వెళ్లినట్టు ఎంపీలతో సీఎం చెప్పారు. వెళ్లిన ప్రతిసారి రాష్ట్ర సమస్యలను ప్రస్తావించానని, ఇదే వైఖరి ఎంపీలు కూడా కొనసాగించాలని చంద్రబాబు ఎంపీలతో చెప్పారు.

‘రెండు గంటల పాటు ఎంపీలతో సమావేశం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరిగింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చ జరిగింది. ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రితో ఇప్పటికే సీఎం చంద్రబాబు సమావేశాలు జరిగాయి. ఈ కేంద్ర బడ్జెట్లో అధిక నిధులు కావాలని కోరుతున్నాం’ అని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എന്നെ ജയിപ്പിച്ചത് ഹിന്ദുക്കള്‍, അവര്‍ക്ക് വേണ്ടി പ്രവര്‍ത്തിക്കും; മുസ്‌ലിം വോട്ടുകള്‍ പൂര്‍ണമായും തൃണമൂലിന് പോയി: സുവേന്ദു അധികാരി

ഹാല്‍ദിയ: പശ്ചിമ ബംഗാള്‍ നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ തൃണമൂല്‍ കോണ്‍ഗ്രസിനെ പരാജയപ്പെടുത്തി ബി.ജെ.പി...

TVK: 'சென்னைவாசி, சிபி சத்யராஜின் ஆதரவு' – சிங்காநல்லூரை வென்ற ஸ்ரீ கிரி பிரசாத்தின் பின்னணி என்ன?

சிங்காநல்லூர் தொகுதியில் மொத்தம் உள்ள 2 லட்சத்து 69 ஆயிரத்து 941...

Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..

Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు ఇటీవల వరుసగా...

ಶೃಂಗೇರಿಯಲ್ಲಿ ವೋಟ್ ಟ್ಯಾಂಪರಿಂಗ್: ಅಂಚೆ ಮತಗಳನ್ನ ತಿದ್ದಲಾಗಿದೆ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಮೇ,5,2026 (www.justkannada.in):  ಶೃಂಗೇರಿಯಲ್ಲಿ ವೋಟ್ ಟ್ಯಾಂಪರಿಂಗ್ ಆಗಿದೆ. ಮರು ಮತ...