19
February, 2025

A News 365Times Venture

19
Wednesday
February, 2025

A News 365Times Venture

Fire Accident: ఆయిల్ కంపెనీలో భారీ పేలుడు.. ఎగిసిపడ్డ మంటలు

Date:

Fire Accident: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులోని BRS ఆయిల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పెలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. బాయిలర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన రాత్రి 11 గంటలకు జరిగింది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో భారీ శబ్దాలు వినిపించాయి. పెద్దెతున్న మంటలు ఆకాశాన్నంటాయి. అగ్ని ప్రమాదం తర్వాత నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేయడానికి శ్రమిస్తున్నప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. పక్కనే ఉన్న మరో ఆయిల్ ట్యాంకర్ పేలే ప్రమాదం ఉండడంతో కార్మికులు, కంపెనీ నిర్వాహకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Also Read: BBL 2025: బిగ్‌బాష్‌ లీగ్‌ 2025 ఫైనల్లో అడుగుపెట్టిన హోబర్ట్‌ హరికేన్స్‌

పేలుడు జరిగిన సమయంలో కంపెనీ షిఫ్ట్ లో సుమారు 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఈ భారీ ప్రమాదంపై సంబంధిత అధికారులు స్పందించి మంటలను అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా వాటిల్లిన నష్టం గురించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. పక్కనే నివసించే ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. అధికారులందరూ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മഹായുതിയില്‍ ഭിന്നത; ‘വൈ’ കാറ്റഗറി സുരക്ഷയില്‍ ഷിന്‍ഡെക്ക് അതൃപ്തിയെന്ന് റിപ്പോര്‍ട്ട്

മുംബൈ: 2024 നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പിന് ശേഷം മഹാരാഷ്ട്രയിലെ ബി.ജെ.പി നേതൃത്വത്തിലുള്ള മഹായുതി...

"தமிழ்நாடு இன்னொரு மொழிப்போரைச் சந்திக்கவும் தயங்காது…" – உதயநிதி எச்சரிக்கை!

மத்திய கல்வித்துறை அமைச்சர் தர்மேந்திர பிரதான், 'தமிழ்நாடு அரசு புதிய கல்விக்...

Vijayawada Metro Project: స్పీడందుకున్న విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు..!

Vijayawada Metro Project: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పనులు...