8
June, 2026

A News 365Times Venture

8
Monday
June, 2026

A News 365Times Venture

Chaudhary Elephant Attack: ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి.. గజరాజుల జాడ కోసం గాలింపు!

Date:

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లిలో జరిగిన ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్, టీడీపీ నేత రాకేష్ చౌదరి చనిపోయారు. పంటపొలాలను ఏనుగులు ధ్వంసం చేస్తుండటంతో.. వాటిని తరిమేందుకు రాకేష్ వెళ్లగా అవి తిరగబడ్డాయి. ఓ ఏనుగు దాడి చేయడంతో 33 ఏళ్ల రాకేష్ చౌదరి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏనుగు తొండంతో చెట్ల కేసి కొట్టి.. ఆపై నేలపై వేసి కాలితో తొక్కడంతో మృతి చెందారు. ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతితో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు.

Also Read: Vaikuntha Dwara Darshan: శ్రీవారి ఆలయంలో ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు!

నారావారిపల్లె, భీమవరం, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల్లో గజరాజుల జాడ కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ సాయంతో రెండు కిలోమీటర్ల పరిదిలో అధికారులు పరిశీలించారు. ఏనుగుల జాడ తెలియకపోవడంతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. భాకరాపేట నుంచి ఏనుగుల మంద రెండుగా విడిపోయింది. ఓ గుంపు కళ్యాణి డ్యామ్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బి.కొంగరవారిల్లి పరిసర ప్రాంతాల్లో మరో గుంపు సంచరిస్తున్నట్లు తెలిసింది. దాడికి పాల్పడిన గుంపులో 5 నుంచి 6 ఏనుగులు ఉన్నాయని ఎఫ్ఆర్వో మాధవి తెలిపారు. ప్రత్యేక బృందాలతో కంటిన్యూగా మానిటరింగ్ చేస్తున్నామన్న ఆమె చెప్పారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഷിഗെല്ല: ഈ വര്‍ഷം രോഗം ബാധിച്ചത് 85 പേര്‍ക്ക്; കഴിഞ്ഞ വര്‍ഷത്തേക്കാള്‍ ഇരട്ടിയോളം

  തിരുവനന്തപുരം: സംസ്ഥാനത്ത് ആശങ്കയായി ഷിഗെല്ല രോഗവ്യാപനം. കഴിഞ്ഞ വര്‍ഷത്തേക്കാള്‍ ഇരട്ടിയോളം...

"திமுக உடன் மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் குரல் கொடுக்கும்; இதை எதிர்காலத்திலும் சொல்வேன்" – பெ.சண்முகம்

திமுக கூட்டணியில் இருந்து தான் கடந்தச் சட்டமனந்த் தேர்தலை சந்தித்தன விடுதலைச்...

Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జి‌ని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!

Bus Accident: ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని కొత్త లంకపల్లి రైల్వే...

പിസ വിതരണം ചെയ്യാന്‍ പോയ ഇന്ത്യന്‍ യുവാവ് വെടിയേറ്റ് കൊല്ലപ്പെട്ടു: യു.എസിലേക്ക് മക്കളെ അയക്കരുതെന്ന് സഹോദരി

ഫിലാഡല്‍ഫിയ: യു.എസിലെ ഫിലാഡല്‍ഫിയയില്‍ 28 വയസുള്ള ഇന്ത്യന്‍ യുവാവ് വെടിയേറ്റ് കൊല്ലപ്പെട്ടു....