20
May, 2026

A News 365Times Venture

20
Wednesday
May, 2026

A News 365Times Venture

Delhi: ఎన్నికల ముందు ఆప్‌కి భారీ షాక్.. బీజేపీలో 100కి పైగా చేరికలు..

Date:

Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంది. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి షాక్ తగిలింది. ఆప్‌కి చెందిన పలువురు కార్యకర్తలు, నేతలు బీజేపీలో చేరారు. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఆధ్వర్యంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మోడల్ టౌన్ శాసనసభలోని కమలా నగర్ వార్డు నుండి రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన కపిల్ నాగర్ బీజేపీలో చేరారు.

Read Also: Sambhal violence: సంభాల్ హింసలో మరో 10 మంది అరెస్ట్.. దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న రమేష్ బిధూరి సమక్షంలో అనేక మంది ఆప్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. బిధురి మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోడీ జీ కుటుంబంలో చేరిన మీ అందరికి ధన్యవాదాలు. మాకు ఇంతకంటే అదృష్టం మరొకటి లేదు. అందరి మద్దతుతో 2024లో భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తించబడుతుంది’’ అని అన్నారు.

ముఖ్యమంత్రి అతిషి నాలుగున్నరేళ్లుగా ప్రజల్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని, వీధులు, రోడ్లు శిథిలావస్థకు చేరాయని అన్నారు. మురుగునీటి వ్యవస్థ సరిగా లేదని, తాగే నీరు కలుషితమైందని ఆప్ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. కల్కాజీ అసెంబ్లీ నుంచి సీఎం అతిషీపై బీజేపీ రమేష్ బిధురిని బరిలోకి దింపింది. ఢిల్లీలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగబోతున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇസ്രഈലിനുള്ള യു.എസ് സഹായത്തെ ഭൂരിഭാഗം അമേരിക്കക്കാരും എതിർക്കുന്നു; ന്യൂയോർക് ടൈംസിന്റെ സർവ്വേ റിപ്പോർട്ട്

വാഷിങ്ടൺ: അമേരിക്കയിലെ ഭൂരിഭാഗം മനുഷ്യരും ഇസ്രഈലിന് യു.എസ് ഭരണകൂടം നൽകുന്ന സാമ്പത്തിക,...

Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్

పశ్చిమాసియా యుద్ధం మళ్లీ మొదలు కాబోతుందా? ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్...

ಜೈಲಿನಲ್ಲಿ ನಟ ದರ್ಶನ್ ಭೇಟಿಯಾದ ಪತ್ನಿ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ, ಪುತ್ರ ವಿನೀಶ್

ಬೆಂಗಳೂರು,ಮೇ,19,2026 (www.justkannada.in):  ರೇಣುಕಾಸ್ವಾಮಿ ಕೊಲೆ ಪ್ರಕರಣದಲ್ಲಿ  ನ್ಯಾಯಾಂಗ ಬಂಧನದಲ್ಲಿದ್ದು ಜೈಲುವಾಸ...