19
May, 2025

A News 365Times Venture

19
Monday
May, 2025

A News 365Times Venture

Korukonda Temple: ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ప్రాంగణంలో అపచారం..

Date:

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని ప్రసిద్ధ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం ప్రాంగణంలో అపచారం చోటు చేసుకుంది. దేవస్థానం కార్యాలయంలో తాగిన మద్యం బాటిల్స్, తిని పాడేసిన బిర్యానీ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఆలయ సిబ్బంది నిర్వాహకంగా అనుమానిస్తున్నారు. రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బంది చేసిన నిర్వాహకంతో ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకులు చూసి నివ్వెరపోయారు. దీంతో.. ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట ఈ ఘటన ఇక్కడ జరిగింది కాదంటూ సిబ్బంది బుకాయించారు. దీనిపై ఆలయ అర్చకులు కూడా నోరు విప్పలేదు.

Read Also: Education Minister: ‘‘కొంతమంది విద్యార్థులు లవ్ ఎఫైర్స్ వల్ల మరణిస్తున్నారు’’.. కోట సూసైడ్‌‌పై వ్యాఖ్యలు..

ఈ ఘటనతో అన్నవరం దేవస్థానం అధికారులు అలర్ట్ అయ్యారు. ఎండోమెంట్ ఉన్నత అధికారులతో దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఇలాంటి ఘటనలు జరగడంపై అపచారం అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. దేవస్థానం కార్యాలయంలో మందు బాటిల్స్ వ్యవహారంపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ స్పందించారు. దేవాలయ ఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు, ఎండోమెంట్ అధికారులతో దర్యాప్తు చేయించి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆలయాలను అపవిత్రం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఇటువంటి వాటికి విరుద్ధమని అన్నారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో సీసీ పుటేజ్, పలు కోణాల్లో విచారణ చేపట్టి నివేదికను ఉన్నతధికారులకు అందజేస్తామని జిల్లా దేవాదాయ శాఖ అధికారి కనపర్తి నాగేశ్వరావు వెల్లడించారు.

Read Also: Maha Kumbh Mela: మహా కుంభమేళలో సిలిండర్ పేలుడు.. భారీ అగ్నిప్రమాదం..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘ആഫ്രിക്കയില്‍ ഒരു ബ്രെഡിന് 50 ഡോളര്‍, ട്രാഫിക് ലൈറ്റുകളില്ല’; സുഹൃത്തിന്റെ സന്ദേശമെന്ന പേരില്‍ മസ്‌ക് പങ്കുവെച്ച പോസ്റ്റ് വിവാദത്തില്‍

ന്യൂയോര്‍ക്ക്: ദക്ഷിണാഫ്രിക്ക ഇരുട്ടിലാണെന്നും രാജ്യത്ത് അടിസ്ഥാന സൗകര്യങ്ങള്‍ കുറവാണെന്നുമുള്ള സുഹൃത്തിന്റെ കുറിപ്പ്...

Pakistan: పాక్ ఆర్మీ, లష్కరే ఉగ్రవాదుల కొత్త కుట్ర.. పీఓకేలో టన్నెల్స్ నిర్మాణం..

Pakistan: పాకిస్తాన్ భారత్‌కి వ్యతిరేకంగా కొత్త కుట్రలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది....

‘ಕೈ’ ಶಾಸಕರೇ ಅಭಿವೃದ್ದಿಗೆ ಹಣವಿಲ್ಲ ಎನ್ನುತ್ತಿರುವಾಗ ಯಾವ ಪುರುಷಾರ್ಥಕ್ಕೆ ಸಾಧನಾ ಸಮಾವೇಶ- ಸಂಸದ ಜಗದೀಶ್ ಶೆಟ್ಟರ್

ಹುಬ್ಬಳ್ಳಿ,ಮೇ,17,2025 (www.justkannada.in):  ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಎರಡು ವರ್ಷ ಪೂರೈಸಿದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ...