23
April, 2025

A News 365Times Venture

23
Wednesday
April, 2025

A News 365Times Venture

INDW vs WIW: భారత బౌలర్ల దెబ్బకి వెస్టిండీస్ బ్యాటర్లు విలవిల.. 44 పరుగులకే ఆలౌట్

Date:

INDW vs WIW: భారత మహిళల అండర్-19 టీ20 జట్టు ప్రపంచకప్‌లో తమ మొదటి మ్యాచ్‌లో అదిరిపోయే విజయం సాధించింది. వెస్టిండీస్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి వెస్టిండీస్ జట్టును కేవలం 44 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇది మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ చరిత్రలో వెస్టిండీస్ జట్టు సాధించిన అత్యల్ప స్కోరు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు భారత బౌలర్ల దాడికి నిలవలేక 44 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్ అయ్యి అండర్-19 టీ20 ప్రపంచకప్ చరిత్రలో మూడో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఇంతకుముందు మలేషియా 23 పరుగులతో అత్యల్ప స్కోరుగా రికార్డుకెక్కగా, జింబాబ్వే 25 పరుగులు మాత్రమే చేసి రెండో స్థానంలో ఉంది.

Also Read: Balakrishna: పార్టీలకు, కులాలకు అతీతంగా నేను సంపాదించిన ఆస్తి ఇదే- బాలయ్య

భారత జట్టు బౌలింగ్‌ను కెప్టెన్ నిక్కీ ప్రసాద్ అద్భుతంగా నిర్వహించింది. ఆరు మంది బౌలర్లను ఉపయోగించిన భారత జట్టు ప్రతీ బౌలర్ వెస్టిండీస్ బ్యాటింగ్‌ను కుదిపేసింది. భారత జట్టు ఈ విజయంతో టోర్నమెంట్‌లో తమ ఉనికిని నిరూపించింది. బౌలింగ్, ఫీల్డింగ్, క్రమశిక్షణతో పాటు జట్టుగా ప్రదర్శించిన నైపుణ్యం ప్రత్యర్థి జట్లకు సవాల్ విసిరింది. టోర్నమెంట్‌లో ముందుకు సాగుతున్న భారత జట్టు ఆత్మవిశ్వాసంతో మరో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉంది. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 4.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి విజయాన్ని కావాల్సిన పరుగులను రాబట్టింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు దెబ్బకు వెస్టిండీస్ జట్టులోని ఐదు మంది బ్యాటర్స్ ఒక్క పరుగు కూడా చేయలేక డక్ అవుట్ గా వెనుతిరిగారు. టీమిండియా బౌలర్లలో పరునిక అత్యధికంగా 3 వికెట్లు తీయగా.. జోషిత, ఆయుషి చెరో రెండు వికెట్లతో వెస్టిండీస్ జట్టును కోలుకోలేని దెబ్బ తీశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕೇಂದ್ರದ ಹಿಂದಿ ಹೇರಿಕೆಗೆ ನಾವು ಒಪ್ಪಲ್ಲ, ವಿರೋಧಿಸುತ್ತೇವೆ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಮಂಡ್ಯ,ಏಪ್ರಿಲ್,22,2025 (www.justkannada.in): ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದ ಹಿಂದಿ ಹೇರಿಕೆಗೆ ನಾವು ಒಪ್ಪಲ್ಲ...

മഹാരാഷ്ട്രയിലെ മറാത്ത്‌വാഡയിൽ കര്‍ഷക ആത്മഹത്യ കൂടുന്നു; 2025ല്‍ 32 ശതമാനത്തിന്റെ വര്‍ധനവ്

മുംബൈ: മഹാരാഷ്ട്രയിലെ മറാത്ത്‌വാഡയിൽ കര്‍ഷക ആത്മഹത്യ വര്‍ധിക്കുന്നതായി റിപ്പോര്‍ട്ട്. 2025 ജനുവരി...

`மகாராஷ்டிராவில் இந்தி கட்டாயமில்லை; ஸ்டாலின் புரிந்து கொள்ள வேண்டும்!’ – பட்னாவிஸ் பதில்

மகாராஷ்டிரா பள்ளிகளில் 1வது வகுப்பு முதல் 5வது வகுப்பு வரை ...

Terror Attack: పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీగా సైన్యం, వైమానిక విమానాలు? ఈ వార్తలో నిజమెంత?

పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధమవుతోంది? పహల్గావ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకుల...