22
April, 2026

A News 365Times Venture

22
Wednesday
April, 2026

A News 365Times Venture

Gold Price Today: షాకింగ్.. వరుసగా నాలుగో రోజు! హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే

Date:

Gold and Silver Price Hyderabad on August 7 2025: బంగారం కొనుగోలు దారులకు షాకింగ్ న్యూస్. వరుసగా నాలుగో రోజు పసిడి ధరలు పెరిగాయి. గత మూడు రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.50, 750, 100 పెరగగా.. ఈరోజు రూ.200 పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్లపై రూ.50, 820, 110 పెరగగా.. నేడు రూ.220 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 7) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.94,000గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,550గా ట్రేడ్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.94,000గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,550గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.94,150గా.. 24 క్యారెట్ల ధర రూ.1,02,700గా ట్రేడ్ అవుతోంది. వరుసగా ధరలు పెరగడంతో పసిడి ప్రియులు షాక్ అవుతున్నారు. పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ రేట్స్ ఇంక్రీజ్ అవ్వడంతో వధువు పేరెంట్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలను చూస్తే.. సామాన్యులు గోల్డ్ కొనే పరిస్థితి లేదు.

Also Read: Kishan Reddy: ఓవైసీ కుటుంబానికి సీఎం పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

మరోవైపు వెండి ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. వరుసగా మూడో రోజు వెండి రేట్స్ పెరిగాయి. గత రెండు రోజుల్లో రూ.2000, రూ.1000 పెరగగా.. ఈరోజు రూ.1000 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,17,000గా ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 27 వేలుగా నమోదైంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ఒక లక్ష 17 వేలుగా ఉంది. ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇవి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇസ്രഈൽ മനുഷ്യാവകാശങ്ങൾ ലംഘിച്ചു, യൂറോപ്യൻ യൂണിയനുമായുള്ള കരാർ മരവിപ്പിക്കണം: അയർലന്റ്

ഡബ്ലിൻ: മനുഷ്യാവകാശങ്ങൾ നഗ്നമായി ലംഘിക്കുന്ന ഇസ്രഈലിനെതിരെ യൂറോപ്യൻ യൂണിയൻ നടപടിയെടുക്കണമെന്ന് അയർലൻഡ്...

`கோவை தெற்கு தொகுதி தேர்தல் ரத்தா?' – மாவட்ட ஆட்சியர் விளக்கம்!

கோவை தெற்கு தொகுதியில் தி.மு.க. சார்பில் செந்தில் பாலாஜியும், அ.தி.மு.க. சார்பில்...

OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం

OTR: NDSA ఛైర్మన్‌ విషయంలో ఏదో తేడా కొడుతోందా? ఆయన...

ಮೈಸೂರು: ರೈತಮುಖಂಡರಿಂದ ಪ್ರತಿಭಟನೆ: ಡಿಸಿ ಕಚೇರಿಗೆ ಮುತ್ತಿಗೆಗೆ ಯತ್ನ

ಮೈಸೂರು,ಏಪ್ರಿಲ್,21,2026 (www.justkannada.in): ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ನಿಗದಿ ಮಾಡಿರುವ ಹೆಚ್ಚುವರಿ ಹಣ...