3
May, 2026

A News 365Times Venture

3
Sunday
May, 2026

A News 365Times Venture

Chaudhary Elephant Attack: ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి.. గజరాజుల జాడ కోసం గాలింపు!

Date:

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లిలో జరిగిన ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్, టీడీపీ నేత రాకేష్ చౌదరి చనిపోయారు. పంటపొలాలను ఏనుగులు ధ్వంసం చేస్తుండటంతో.. వాటిని తరిమేందుకు రాకేష్ వెళ్లగా అవి తిరగబడ్డాయి. ఓ ఏనుగు దాడి చేయడంతో 33 ఏళ్ల రాకేష్ చౌదరి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏనుగు తొండంతో చెట్ల కేసి కొట్టి.. ఆపై నేలపై వేసి కాలితో తొక్కడంతో మృతి చెందారు. ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతితో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు.

Also Read: Vaikuntha Dwara Darshan: శ్రీవారి ఆలయంలో ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు!

నారావారిపల్లె, భీమవరం, కొండ్రెడ్డి కండ్రిగ గ్రామాల్లో గజరాజుల జాడ కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్ సాయంతో రెండు కిలోమీటర్ల పరిదిలో అధికారులు పరిశీలించారు. ఏనుగుల జాడ తెలియకపోవడంతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. భాకరాపేట నుంచి ఏనుగుల మంద రెండుగా విడిపోయింది. ఓ గుంపు కళ్యాణి డ్యామ్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బి.కొంగరవారిల్లి పరిసర ప్రాంతాల్లో మరో గుంపు సంచరిస్తున్నట్లు తెలిసింది. దాడికి పాల్పడిన గుంపులో 5 నుంచి 6 ఏనుగులు ఉన్నాయని ఎఫ్ఆర్వో మాధవి తెలిపారు. ప్రత్యేక బృందాలతో కంటిన్యూగా మానిటరింగ్ చేస్తున్నామన్న ఆమె చెప్పారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..

AC Blast: ఢిల్లీలోని వివేక్ విహార్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9...

ಮೈಸೂರಿನ ಹೃದಯ ಭಾಗದಲ್ಲಿಯೇ ವಾಲಾಡುತ್ತಿದೆ ತೂಗುಗತ್ತಿ!

  ಮೈಸೂರು, ಮೇ.೦೩,೨೦೨೬: ಬೆಂಗಳೂರಿನ ಬೌರಿಂಗ್ ಆಸ್ಪತ್ರೆಯ ಕಾಂಪೌಂಡ್ ಕುಸಿದು 7...

മാപ്പ് മാപ്പ് മാപ്പ്; സവര്‍ക്കര്‍ ബ്രിട്ടീഷ് ഭരണകാലത്ത് അഞ്ച് തവണ മാപ്പപേക്ഷ നല്‍കിയിരുന്നു: ചെറുമകന്‍

ന്യൂദല്‍ഹി: തീവ്ര ഹിന്ദുത്വവാദിയായ സവര്‍ക്കര്‍ ബ്രിട്ടിഷ് ഭരണകാലത്ത് അഞ്ച് തവണ മാപ്പപേക്ഷ...