17
September, 2026

A News 365Times Venture

17
Thursday
September, 2026

A News 365Times Venture

OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?

Date:

OTR: తెలంగాణ కమలంలో కొత్త ఈక్వేషన్స్‌ తెరపైకి రాబోతున్నాయా? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం పావులు కదుపుతోందా? అందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కీలకమైన బాధ్యత అప్పగించే అవకాశం ఉందా? ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పే ఆలోచన ఉందా? ఇంతకీ బండికి ఏ బాధ్యత ఇచ్చే అవకాశం ఉంది? దాని గురించి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి?. తెలంగాణ బీజేపీలో భారీగా సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా సంచలన నిర్ణయాలకు ఛాన్స్‌ ఉందని కూడా అంచనా వేస్తున్నాయి రాజకీయవర్గాలు. రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మారవచ్చని అంటున్నారు. అలాగే… మరికొన్ని మార్పులు కూడా జరుగుతాయనే టాక్‌ నడుస్తోంది కాషాయ వర్గాల్లో. మార్పుల్లో భాగంగా…. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి కీలక బాధ్యతలు అప్పగిస్తారని కూడా చెప్పుకుంటున్నారు. ఆయన్ని రాష్ర్ట అధ్యక్షుడుగా నియమిస్తారన్న ప్రచారం ఒక దశలో పెద్ద ఎత్తున జరిగింది.

అయితే ప్రస్తుతం రామచందర్‌రావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందున అయన పదవీకాలం ముగిసే వరకు మార్చే అవకాశం లేదు. రామచందర్‌రావు కూడా వివిధ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారని, ఆయన పనితీరు విషయంలో పార్టీ హై కమాండ్ సంతృప్తిగానే ఉందని అంటున్నారు. అయితే… రాష్ట్ర పార్టీలో మాస్‌ ఊపు తీసుకురావాలంటే… కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని రంగంలోకి దించాలన్న ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ని కేంద్ర మంత్రిగా కొనసాగిస్తూనే.. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. సంజయ్‌ సన్నిహితులు కూడా ఈ సంగతి చెబుతున్నా… మార్పు ఎప్పడు ఉంటుంది? వెంటనేనా? లేక వెయిట్‌ చేస్తారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. బండి సంజయ్‌ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తేనే… పార్టీకి ఊపు వస్తుందని నమ్ముతున్నారట పెద్దలు. ఆయన అలా తిరగాలంటే… ఏదో ఒక కీలకమైన బాధ్యత ఇవ్వడం అవసరం.

అందుకే… రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి బీజేపీ వర్గాలు. రాష్ట్ర పార్టీ ఎంపీలను ఇటీవల ఢిల్లీలోని తన నివాసానికి ఆహ్వానించారు సంజయ్‌. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్, డిన్నర్ ఇలా రకరకాల మీటింగ్స్‌ జరిగాయి. బండికి కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం అప్పట్నుంచే ఉంది. ఈ క్రమంలో తాజాగా ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. 2023 ఎన్నికలకి ముందు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిన బీజేపీ… కిషన్‌రెడ్డికి బాధ్యతలు ఇచ్చింది. అప్పుడు ఈటల రాజేందర్‌కి ప్రచార కమిటీ సారధ్య బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు ఆ పదవిని బండికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తమ తదుపరి టార్గెట్‌ తెలంగాణేనని పార్టీ ఢిల్లీ పెద్దలు ఇప్పటికే చెప్పారు. ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటేగనుక… ముందుగానే పని ప్రారంభిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మార్పులు చేర్పులకు పెద్దగా టైం పట్టక పోవచ్చన్నది పార్టీ టాక్‌.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಅಪಘಾತಕ್ಕೀಡಾದ ನರಿಯನ್ನು ರಕ್ಷಿಸಿ ಮಾನವೀಯತೆ ಮೆರೆದ ಚೆಸ್ಕಾಂ ಅಧಿಕಾರಿ..

ಮೈಸೂರು,ಸೆಪ್ಟಂಬರ್,17,2026 (www.justkannada.in):  ರಸ್ತೆ ಅಪಘಾತದಲ್ಲಿ ಗಾಯಗೊಂಡು ಸಾವು-ನೋವಿನ ನಡುವೆ ನರಳುತ್ತಿದ್ದ...

സഖ്യകക്ഷികൾ ഒഴിഞ്ഞുമാറുന്നു; ഹൂതികൾക്ക് മുന്നിൽ പ്രതിസന്ധിയിലായി സൗദി അറേബ്യ

റിയാദ്: യെമനിലെ ഹൂതി വിമതരുടെ ആക്രമണം വീണ്ടും ശക്തമായതോടെ സൗദി അറേബ്യ...

லண்டன் பயணம்: “முதல்வர் விஜய் செய்தியாளர்களைச் சந்தித்து…" – டி.ஆர்.பி. ராஜா அடுக்கும் கேள்விகள்

முதல்வர் விஜய் முதலீடுகளை ஈர்க்க லண்டன் பயணம் மேற்கொண்டிருந்த நிலையில், லண்டன்...