7
September, 2026

A News 365Times Venture

7
Monday
September, 2026

A News 365Times Venture

Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!

Date:

Andhra Paper Mill Fine: రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుపై కాలుష్య నియంత్రణ మండలి కఠిన చర్యలు చేపట్టింది. పర్యావరణ నిబంధనలను పదేపదే ఉల్లంఘించిందని నిర్ధారించిన పీసీబీ.. పేపర్ మిల్లు పరిశ్రమకు రూ.21 కోట్లకు పైగా పర్యావరణ పరిహారం విధించింది. గోదావరిలో వ్యర్థాల విడుదలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ.. కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేసింది.

రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రూ.21.01 కోట్ల పర్యావరణ పరిహారం క్రింద జరిమానా విధించింది. పర్యావరణ నిబంధనలను పదేపదే ఉల్లంఘించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పీసీబీ వెల్లడించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 26న తూర్పులంక ఇసుక మేటలు, పరిసర ప్రాంతాలను పరిశీలించిన సందర్భంగా గుర్తించిన పర్యావరణ ఉల్లంఘనలపై పీసీబీ మే 28, జూన్ 12 తేదీల్లో ఆంధ్రా పేపర్ మిల్లుకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వ్యర్థాల పారవేతకు ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

సంస్థకు లోపాలు సరిదిద్దుకునేందుకు తగిన సమయం, అవకాశాలు కల్పించినప్పటికీ సెప్టెంబర్ 3న నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పర్యావరణ పరిహారంగా రూ.21.01 కోట్ల జరిమానా విధించారు. గోదావరి పరిసరాల్లో వ్యర్థాలను విడుదల చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పీసీబీ స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ ఉండదని, భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಹಿಂದುಳಿದ ಒಕ್ಕೂಟ ಸಮಾವೇಶ ನನಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿಲ್ಲ- ಸಚಿವ ಸತೀಶ್ ಜಾರಕಿಹೊಳಿ

ಬೆಂಗಳೂರು,ಸೆಪ್ಟಂಬರ್,7,2026 (www.justkannada.in): ಹಿಂದುಳಿದ ಒಕ್ಕೂಟ ಸಮಾವೇಶ ನನಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿಲ್ಲ. ನನ್ನನ್ನು...

ഹോർമുസിൽ പുതിയ കപ്പൽച്ചാലും നിയന്ത്രണങ്ങളും പ്രഖ്യാപിക്കാൻ ഇറാൻ; യു.എസ് സംഘർഷം രൂക്ഷമാകുന്നു

ടെഹ്‌റാൻ: ഹോർമുസ് കടലിടുക്കിന് സമീപം പ്രവേശന നിയന്ത്രിത മേഖല ഏർപ്പെടുത്തുമെന്നും ഒമാനുമായി...

முதல்வர் உரை: "பதிலற்ற பதிலுரை; Prepare well next time.!" – உதயநிதி விமர்சனம்

மூன்று நாள் விடுமுறைக்கு பிறகு தமிழக சட்டமன்றம் இன்று கூடியிருக்கிறது. காவல்துறை,...

Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..

దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన...