27
August, 2026

A News 365Times Venture

27
Thursday
August, 2026

A News 365Times Venture

Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!

Date:

కులగణన ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కులగణనలో వెనుకబడిన తరగతుల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక కాలమ్ లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంయుక్తంగా లేఖ రాశారు.

కులగణనను నిర్వహించడం మాత్రమే కాకుండా.. దానిని సరైన పద్ధతిలో నిర్వహించడం అత్యంత ముఖ్యమని ఖర్గే సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న కుల వివరాల నమోదు విధానం తప్పుదోవ పట్టించేలా ఉందని రాహుల్ గాంధీ, ఖర్గే ఆరోపించారు.

ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో వ్యక్తులు తమ కులం పేరును ఏ విధంగా చెబితే.. అదే పేరును నమోదు చేస్తారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒకే కులాన్ని వేర్వేరు పేర్లు, ఉపకులాలు, భాషల్లో పిలుస్తారని తెలిపారు. ఒకే కులానికి చెందిన వ్యక్తుల వివరాలు వేర్వేరు పేర్లతో నమోదైతే.. ఆ కులం వేలాది పేర్లుగా విడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా లక్షల సంఖ్యలో కులాల పేర్లతో జాబితా తయారై.. కులగణన ద్వారా సేకరించిన మొత్తం డేటా ప్రయోజనం లేకుండా పోయే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న కులగణన ప్రశ్నావళిని రద్దు చేసి.. రాజకీయ పార్టీలు, నిపుణులు, ప్రజలతో సంప్రదింపులు జరిపిన అనంతరం కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని రాహుల్ గాంధీ, ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతి కులం, సమాజానికి చెందిన జనాభాను కచ్చితంగా లెక్కించేలా విధానం ఉండాలని కోరారు.

కులాల కోసం ‘డ్రాప్‌డౌన్’ జాబితా ఏర్పాటు చేయాలని సూచించారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఇప్పటికే ఉన్న ప్రభుత్వ జాబితాలు, ఆంత్రోపలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ఆధారంగా ఈ జాబితాను సులభంగా రూపొందించవచ్చని తెలిపారు. తెలంగాణ, బీహార్‌లో నిర్వహించిన సర్వేల్లో ఇదే తరహా విధానాన్ని అనుసరించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కులాల జాబితాలను కూడా తమ లేఖకు జత చేశారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కులగణన నిర్వహించాలనే నిజమైన ఉద్దేశం కేంద్రానికి లేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితిని “మోసం”గా అభివర్ణిస్తూ.. కులగణనను కావాలనే పక్కన పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రెండు వారాల క్రితం కేంద్ర ప్రభుత్వం 2027 జనగణనకు సంబంధించి 40 ప్రశ్నలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో 10వ ప్రశ్న కులానికి సంబంధించినది. ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం డ్రాప్‌డౌన్ జాబితాను ఏర్పాటు చేయగా.. ఇతర కులాల వివరాల కోసం ఓపెన్ ఎండెడ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇతర వెనుకబడిన తరగతుల కోసం కూడా డ్రాప్‌డౌన్ జాబితాను చేర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. “Gen Z విద్యార్థుల మాదిరిగా OBC వర్గాలు కూడా రోడ్లపైకి వస్తే.. ప్రభుత్వం దిగిరాక తప్పదు” అని వ్యాఖ్యానించారు. తాజాగా కులగణన విధానంపై ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ, ఖర్గే లేఖ రాయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മിന്നല്‍ പ്രളയത്തില്‍ വിറങ്ങലിച്ച് നേപ്പാള്‍; മരണം 160 ആയി: 133 ഇന്ത്യക്കാരുള്‍പ്പെടെ 750 ലധിം പേരെ കാണാനില്ല

കാഠ്മണ്ഡു: നേപ്പാളിലുണ്ടായ മിന്നല്‍ പ്രളയത്തില്‍ മരണ സംഖ്യ ഉയര്‍ന്നു. 160 ഓളം...

Iran: "மொஜ்தபா காமேனி இறந்துவிட்டதாக நான் நினைக்கவில்லை; ஆனால்.." – ட்ரம்ப் சொல்வது என்ன?

அமெரிக்கா, இஸ்ரேல் தாக்குதலில், பிப்ரவரி 28-ம் தேதி, ஈரானின் உச்சத் தலைவர்...

Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!

Off The Record: ఏపీలో స్థానిక ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు...

ರಾಯಚೂರು ಐ.ಐ.ಐ.ಟಿಯಲ್ಲಿ 12 ಕೋಟಿ ರೂ. ವೆಚ್ಚದಲ್ಲಿ AI ಉತ್ಕೃಷ್ಟತಾ ಕೇಂದ್ರ ಸ್ಥಾಪನೆ-ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,26,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣ ಕೈಗಾರಿಕಾ ಬೆಳವಣಿಗೆ ಸಾಧಿಸಲು ಸರಕಾರ...