20
August, 2026

A News 365Times Venture

20
Thursday
August, 2026

A News 365Times Venture

Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్‌లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!

Date:

Banana Prices Hike in Ravulapalem Market: శ్రావణమాస శోభతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం అరటి మార్కెట్‌ కళకళలాడుతోంది. పండుగలు, పూజల నేపథ్యంలో అరటిపండ్లకు డిమాండ్‌ పెరగడంతో.. మార్కెట్‌ యార్డ్‌ మొత్తం రైతులు, కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. అరటి గెలలకు భారీ గిరాకీ రావడంతో ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం రావులపాలెం మార్కెట్‌లో ఒక్కో అరటి గెల ధర రూ.800 నుంచి రూ.1,000 వరకు పలుకుతోంది. గత 15 రోజులుగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అరటి దిగుబడి తగ్గడం, మరోవైపు మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతో ధరలకు రెక్కలు వచ్చాయి.

శ్రావణమాసంలో పూజలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో స్థానికంగా అరటిపండ్ల వినియోగం గణనీయంగా పెరిగింది. డిమాండ్‌కు తగిన స్థాయిలో సరఫరా లేకపోవడంతో మార్కెట్‌లో ధరలు మరింత పెరుగుతున్నాయి. దీంతో చాలాకాలం తర్వాత రావులపాలెం అరటి మార్కెట్‌లో శ్రావణ సందడి కనిపిస్తోంది. కోనసీమలో పండించే అరటికి ఇతర రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు భారీగా అరటి కొనుగోళ్ల కోసం రావులపాలెం మార్కెట్‌కు క్యూ కడుతున్నారు. దీంతో మార్కెట్‌ యార్డ్‌ నిత్యం రద్దీగా మారింది.

కర్పూర, చక్కరకెళ్ల రకాల అరటికి అత్యధిక గిరాకీ ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ రకాల అరటిని కొనుగోలు చేసేందుకు పక్క రాష్ట్రాల వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో లోడుపై కూడా గతంతో పోలిస్తే అదనంగా రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు ధర లభిస్తున్నట్లు తెలుస్తోంది. ధరలు పెరగడంతో అరటి రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాధారణంగా దిగుబడి తగ్గితే రైతులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే.. అరటి రైతులకు గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కోనసీమ అరటికి దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌, శ్రావణమాసంలో స్థానిక వినియోగం పెరగడం, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొనుగోళ్లతో రావులపాలెం మార్కెట్‌ కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മോഹൻ ഭാഗവതിന്റെ യു.എസ് സന്ദർശനത്തിന് മുന്നോടിയായി ആർ.എസ്.എസ്സിനെതിരെ ഉപരോധ ആവശ്യം; USCIRF ഇടപെടൽ

ന്യൂദൽഹി: ആർ.എസ്.എസ് മേധാവി മോഹൻ ഭാഗവത് മൂന്ന് രാജ്യങ്ങളിലേക്കുള്ള സന്ദർശനം ആരംഭിക്കാനിരിക്കെ,...

"அம்மா, உங்களையும் அப்பாவையும் ஒன்றாக பார்த்து 35 ஆண்டுகளுக்கும் மேலாகிவிட்டது.!"- ராகுல் உருக்கம்

இந்திய தேசிய காங்கிரஸின் மூத்த தலைவர் சோனியா காந்தியின் வாழ்க்கைப் பயணத்தை...

ಕರ್ನಾಟಕ ಸೇರಿ ದಕ್ಷಿಣ ಭಾರತಕ್ಕೆ ನ್ಯಾಯಯುತ ಅನುದಾನ ನೀಡಿ: ಸಿಎಂ ಡಿ.ಕೆ ಶಿವಕುಮಾರ್ ಒತ್ತಾಯ

ಮಹಾಬಲಿಪುರಂ, ಆಗಸ್ಟ್, 20,2026 (www.justkannada.in): “ಕರ್ನಾಟಕ ಬಲಿಷ್ಠವಾದಾಗ, ದಕ್ಷಿಣ ಭಾರತ...

ധര്‍മേന്ദ്ര പ്രധാന് ശേഷം മനന്‍ മിശ്ര! ബാര്‍ കൗണ്‍സില്‍ ഓഫ് ഇന്ത്യ ചെയര്‍മാന്റെ രാജി ആവശ്യപ്പെട്ട് സി.ജെ.പി

ന്യൂദല്‍ഹി: ബാര്‍ കൗണ്‍സില്‍ ഓഫ് ഇന്ത്യ ചെയര്‍മാന്‍ മനന്‍ കുമാര്‍ മിശ്രയുടെ...