18
August, 2026

A News 365Times Venture

18
Tuesday
August, 2026

A News 365Times Venture

Dharmendra Pradhan: విద్యార్థి నాయకుడి నుంచి కేంద్ర మంత్రి వరకు.. ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్థానం ఇదే..

Date:

Dharmendra Pradhan: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపారు. నీట్-యూజీ పరీక్షలో జరిగిన అవకతవకల చుట్టూ దేశవ్యాప్తంగా నెలకొన్న వివాదం, జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించి, తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం..

ధర్మేంద్ర ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని ఆంగుల్ జిల్లా తాల్చేర్‌లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. 1983లో తాల్చేర్ కాలేజీలో హయ్యర్ సెకండరీ చదువుతున్న సమయంలోనే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ద్వారా విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1985లో తాల్చేర్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికై తన రాజకీయ ప్రయాణానికి బలమైన పునాది వేసుకున్నారు. అనంతరం విద్యార్థి నాయకుడిగా వేగంగా ఎదుగుతూ, 1993లో ఏబీవీపీ ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, 1995లో జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. విద్య విషయానికి వస్తే, ఒడిశాలోని ప్రముఖ ఉత్కల్ యూనివర్సిటీ (భువనేశ్వర్) నుంచి 1990లో ఆంత్రోపాలజీ (మానవశాస్త్రం) విభాగంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (M.A.) పట్టా పొందారు. 1998లో అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన ఆయన, అదే సంవత్సరంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

బీజేపీలో చేరిన తర్వాత ప్రధాన్ ఒడిశా ప్రత్యక్ష రాజకీయంలో కీలక పాత్ర పోషించారు. 2000లో ఒడిశా శాసనసభకు పల్లహరా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేవ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2012లో బీహార్ నుంచి, ఆ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర స్థాయిలో కీలక నాయకుడిగా ఎదిగారు. బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పలు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించి అధిష్టానం నమ్మకాన్ని గెలుచుకున్నారు.

2014లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా (స్వతంత్ర హోదా) బాధ్యతలు స్వీకరించారు. ‘ఉజ్వల యోజన’ పథకం ద్వారా దేశవ్యాప్తంగా పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన పనితీరుకు గుర్తింపుగా 2017లో క్యాబినెట్ హోదాకు ప్రమోట్ అవ్వడమే కాకుండా, నైపుణ్యాభివృద్ధి శాఖ బాధ్యతలను కూడా చేపట్టారు. 2021లో కేంద్ర క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఆయనకు విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ బాధ్యతలు అప్పగించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలోని సంబల్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికై, మరోసారి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. ఒడిశాలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి తొలిసారి అధికారంలోకి రావడంలో కూడా ఆయన వ్యూహకర్తగా ముఖ్య భూమిక పోషించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നീറ്റ് പ്രതിഷേധത്തിനിടെ AK-47 ഉപയോഗിച്ച് വെടിവെച്ച സംഭവം; സുപ്രീം കോടതിയിൽ ബീഹാർ പൊലീസിന്റെ സത്യവാങ്മൂലം

സിവാൻ: നീറ്റ്-യുജി പരീക്ഷാ ക്രമക്കേടുകൾക്കെതിരെ ബീഹാറിൽ നടന്ന പ്രതിഷേധത്തിനിടെ സിവാനിൽ പൊലീസുകാരൻ...

உயிரோடிருப்பவருக்கு போலி இறப்புச் சான்றிதழ்; 'சொத்தை அபகரிக்கவா?' – கலெக்டர் காலில் விழுந்த மூதாட்டி

மதுரை மாவட்டம் சிக்கந்தர் சாவடி முனியாண்டி கோவில் தெரு பகுதியைச் சேர்ந்தவர்...

ലാല്‍ സലാം സഖാവേ; ഉഷാറാക്ക്! കുട്ടി സഖാക്കളെ വീഡിയോ കോള്‍ വിളിച്ച് പ്രതിപക്ഷ നേതാവ്

തിരുവനന്തപുരം: ഇന്‍സ്റ്റഗ്രാമില്‍ തരംഗമായ കുട്ടി സഖാവ് എന്ന ഇന്‍സ്റ്റഗ്രാം പേജ് മെറ്റ...