13
July, 2026

A News 365Times Venture

13
Monday
July, 2026

A News 365Times Venture

Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!

Date:

Visakhapatnam Earthquake: విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయం 5 గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో భయాందోళనకు గురైన ప్రజలు.. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖలోని సాగర్‌ నగర్, పెదవాల్తేరు సహా పలు కాలనీల్లో ప్రాంతాల్లో భూమి కంపించింది. తెల్లవారుజామున నిద్రలో ఉన్న సమయంలో కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. గాజువాక, మంగళపాలెం, సాగర్‌ నగర్, పెదవాల్తేరు, ఆరిలోవ, ఎంవీపీ అప్పుఘర్‌లో ఆదివారం ఉదయం 5.08 గంటలకు భూమి కంపించింది. బంగాళాఖాతంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. కాకినాడకు సుమారు 225 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. భూకంప ప్రభావంతో విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. అకస్మాత్తుగా భూమి కంపించడంతో నగరం మొత్తంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബി.ജെ.പിക്ക് ആശ്വസിക്കാം; സുഗതന് ജയിലില്‍ സത്യപ്രതിജ്ഞ ചെയ്യാന്‍ കോടതി അനുമതി

തിരുവനന്തപുരം: തിരുവനന്തപുരം നഗരസഭയിലെ ബി.ജെ.പി കൗണ്‍സിലര്‍ ആര്‍. സുഗതന്റെ സത്യപ്രതിജ്ഞ നാളെ...

“ `கொத்து புரோட்டா' என அநாகரிகமாகப் பேசுகிறார்; இது தொடந்தால்..!" – ஆர்.எஸ்.பாரதி எச்சரிக்கை!

தி.மு.க அமைப்புச் செயலாளர் ஆர்.எஸ்.பாரதி செய்தியாளர்களைச் சந்தித்துப் பேசினார். அப்போது அவர்,...

ಆಷಾಢ ಮಾಸ: ಚಾಮುಂಡಿ ಬೆಟ್ಟದ ಮೆಟ್ಟಲು, ಗೋಪುರಗಳಿಗೆ ಬಣ್ಣ-ಸುಣ್ಣ

ಮೈಸೂರು,ಜುಲೈ,13,2026 (www.justkannada.in):  ಆಷಾಢ ಮಾಸದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಚಾಮುಂಡಿ ಬೆಟ್ಟಕ್ಕೆ ಆಗಮಿಸುವ...

രക്തസാക്ഷി ദിനത്തിന് മുന്നോടിയായി തന്നെയും മെഹബൂബ മുഫ്തിയെയും വീട്ടുതടങ്കലിലിട്ടതായി ഇല്‍തിജ

ശ്രീനഗര്‍: കശ്മീരില്‍ രക്തസാക്ഷി ദിനമായി ആചരിക്കുന്ന ജൂലൈ 13ന് മുന്നോടിയായി തന്നെയും...