28
June, 2026

A News 365Times Venture

28
Sunday
June, 2026

A News 365Times Venture

Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి

Date:

Amaravati Tension: అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఆర్డీఏ పరిరక్షణ బృందం పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ వద్ద వైసీపీ నేతలు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు రాజధాని భూములను పరిశీలించేందుకు వెళ్తుండగా, టీడీపీ సానుభూతిపరులు, రాజధాని రైతులు వారిని అడ్డుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా “గో బ్యాక్ వైసీపీ” అంటూ నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు.దీంతో, ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై కోడిగుడ్లు విసిరిన ఘటన చోటుచేసుకుంది. అలాగే లేళ్ల అప్పిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు రువ్వడంతో వాహనం ధ్వంసమైనట్లు సమాచారం.

మరోవైపు ఘటనను అదుపు చేసేందుకు పోలీసులు జోక్యం చేసుకున్నప్పటికీ ఉద్రిక్తత కొనసాగింది. ఈ క్రమంలో పోలీసులపై కూడా రాళ్లు రువ్వినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బంది గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉండవల్లి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో రాజధాని ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తత మరోసారి తెరపైకి వచ్చింది.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മുഖ്യമന്ത്രിയുടെ നിര്‍ദേശമില്ലാതെയാണ് വി.സി നിയമനമെന്ന് വിശ്വസിക്കുന്ന യു.ഡി.എഫ് അണികളും വിസ്മയത്തിന്റെ ഇരകള്‍: എസ്.എഫ്.ഐ

തിരുവനന്തപുരം: കാര്‍ഷിക സര്‍വകലാശാല വൈസ് ചാന്‍സിലറായി ബി.ജെ.പി അനുകൂല സംഘടനാ നേതാവിനെ...

Congress: மாணிக்கம் தாகூர் தலைவராக நியமனம்; தமிழ்நாடு காங்கிரஸ் கமிட்டியில் அதிரடி மாற்றம்!

தமிழ்நாடு காங்கிரஸ் தலைவராக மாணிக்கம் தாகூர் நியமிக்கப்பட்டுள்ளார். இதற்கு முன் செல்வப்பெருந்தகை...

35,196 ಹುದ್ದೆಗಳು ಖಾಲಿ, ಸಿಬ್ಬಂದಿಗೆ ವೇತನವಿಲ್ಲ: ಐಸಿಯುನಲ್ಲಿ ಆರೋಗ್ಯ ಇಲಾಖೆ- ಆರ್.ಅಶೋಕ್ ಟೀಕೆ

ಬೆಂಗಳೂರು,ಜೂನ್,27,2026 (www.justkannada.in): ಗ್ಯಾರಂಟಿಗಳ ಹೆಸರಲ್ಲಿ ಖಜಾನೆ ಖಾಲಿ ಮಾಡಿ, ಈಗ...

വിദ്യാര്‍ത്ഥി പ്രതിസന്ധിക്കും ചോദ്യപേപ്പര്‍ ചോര്‍ച്ചയ്ക്കുമെതിരെ കോണ്‍ഗ്രസിന്റെ ഘൊരാവോ; പാര്‍ലമെന്റ് വളയും

ന്യൂദല്‍ഹി: രാജ്യത്തെ വിദ്യാര്‍ത്ഥികളും യുവാക്കളും നേരിടുന്ന വിവിധ പ്രശ്‌നങ്ങള്‍ ഉയര്‍ത്തിക്കാട്ടുന്നതിനായി ‘ഛാത്രോം...