29
June, 2026

A News 365Times Venture

29
Monday
June, 2026

A News 365Times Venture

Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!

Date:

Narendra Modi : తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. “నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా..” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రజలు పాటించాల్సిన పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఇంధన సంక్షోభం తలెత్తినప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా జాగ్రత్త పడుతున్నామని ప్రధాని తెలిపారు. అయితే, విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రజలు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని, అలాగే విదేశీ పర్యటనలను కూడా వాయిదా వేసుకోవాలని కోరారు. వీటితో పాటు వంట నూనెల వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించారు. దేశం నుంచి బయటకు వెళ్లే ధనాన్ని అరికట్టడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలు మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలని ప్రధాని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో కూడా భారీ మార్పులు రావాలని ఆకాంక్షించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రసాయన ఎరువుల వల్ల భూమికి నష్టం వాటిల్లడమే కాకుండా దేశ సంపద కూడా కరిగిపోతోందని, అందుకే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. వ్యవసాయంలో డీజిల్ ఇంజన్లకు బదులుగా సౌర శక్తితో నడిచే పంపు సెట్లను ప్రోత్సహిస్తున్నామని ఆయన వివరించారు.

స్వదేశీ వస్తువుల వినియోగంపై ప్రధాని ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. స్వదేశీ గురించి మాట్లాడగానే చాలామంది కేవలం దీపావళి దీపాల గురించే ఆలోచిస్తారని, కేవలం మట్టి దీపాలు కొన్నంత మాత్రాన స్వదేశీని పూర్తిస్థాయిలో ప్రోత్సహించినట్లు కాదని స్పష్టం చేశారు. ప్రతి రోజూ వాడే వస్తువుల నుంచి వ్యవసాయ పరికరాల వరకు సాధ్యమైనంత వరకు భారత్‌లో తయారైన వస్తువులనే వాడాలని, అప్పుడే నిజమైన ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. దేశాభివృద్ధి కోసం ప్రజలందరూ ఈ క్రమశిక్షణను పాటించాలని ఆయన కోరారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

തമിഴ്‌നാടിന് മുമ്പൊരു കൃത്യമായ ഭരണമുണ്ടായിരുന്നു; ഇന്നത് എവിടെ പോയെന്ന് ജനം തിരയുകയാണ്: ഉദയനിധി സ്റ്റാലിന്‍

ചെന്നൈ: തമിഴ്‌നാട്ടില്‍ ഒരു കാലത്ത് നല്ല ഭരണം ഉണ്ടായിരുന്നുവെന്നും എന്നാല്‍ ഇപ്പോള്‍...

"125 நாள்கள் வேலைக்கு நிதி ஒதுக்கீடு எங்கே?" – மத்திய அரசுக்கு பெ.சண்முகம் கேள்வி | Live Updates

125 நாள்கள் வேலை - பெ.சண்முகம் கேள்விஜூலை 1 முதல் கிராமப்புற...

Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..

Aman Sanger: భారతీయ యువత సత్తా ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఏలుతోంది....

‘സംഘിയെയും വിശ്വാസിയെയും തിരിച്ചറിയാന്‍ കോണ്‍ഗ്രസുകാര്‍ക്കറിയാം’; ശേഷാദ്രിനാഥന്റെ നിയമനത്തില്‍ കെ.എം. ഷാജിക്ക് പി.എം. നിയാസിന്റെ മറുപടി

  തിരുവനന്തപുരം: സംസ്ഥാന തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണറായി എന്‍. ശേഷാദ്രിനാഥനെ നിയമിക്കുന്നതിനെച്ചൊല്ലി യു.ഡി.എഫിലും...