West Bengal Exit Poll 2026: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 29తో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయని సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారు. 294 సీట్లు కలిగిన బెంగాల్లో మళ్లీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ గెలుస్తుందా? లేక ఈసారి బీజేపీ పాగా వేస్తుందా అనే దానిపై ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
Read Also: Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే అధికారం అని చెబుతున్నాయి. తాజాగా వెలువడిన టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. బెంగాల్లో 192 సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని, తృణమూల్ కాంగ్రెస్ 100 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని చెప్పింది. ఇతరులకు కేవలం రెండు సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఓట్ షేర్ ప్రకారంగా చూస్తే బీజేపీ 48 శాతం, టీఎంసీ 38 శాతం, ఇతరులు 14 శాతం ఓట్లను సాధిస్తారని జోస్యం చెప్పింది.





