అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలకు మార్గం సుగమం అయినట్లుగా తెలుస్తోంది. గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇంకోవైపు రెండు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈనెల 21తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన వచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటిస్తున్నాడు. తదుపరి చర్చల కోసం ఒప్పించేందుకు ఇరాన్ పెద్దలతో సమావేశం అయ్యారు. మొత్తానికి చర్చలపై క్లారిటీ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
సోమవారం ఇస్లామాబాద్ వేదికగా మరోసారి అమెరికా-ఇరాన్ చర్చలు ఉండొచ్చని నివేదికలు అందుతున్నాయి. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మీడియాకు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అమెరికా అధికారులు మాత్రం అధికారికంగా ధృవకరించలేదు.
ఇది కూడా చదవండి: Modi Cabinet: ఉ.11:30కి మోడీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఇదిలా ఉంటే యురేనియం మొత్తం అమెరికాకు అప్పగించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. మొత్తానికి పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఒకవేళ చర్చలు ఫలిస్తే.. సంతకాల కోసం తాను వ్యక్తిగతంగా పాకిస్థాన్ వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్ చాలా మంచి పని చేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు.





