31
August, 2026

A News 365Times Venture

31
Monday
August, 2026

A News 365Times Venture

Lone survivor: మృత్యుంజయుడు.. విమానం నుంచి ప్రాణాలతో ఇలా బయటపడ్డాడు..

Date:

Lone survivor: ఎయిరిండియా విమానం ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన పట్ల యావత్ దేశంతో పాటు ప్రపంచ దేశాలు సంతాపాన్ని వ్యక్తం చేశాయి. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అందరూ మరణించారు. విమానం మెడికల్ కాలేజ్ హస్టల్‌పై కూలడంతో 24 మంది మెడికోలు చనిపోయారు.

Read Also: Israel Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో భారతీయులకు కీలక సలహా..

ఇదిలా ఉంటే, ఇంత పెద్ద ప్రమాదం నుంచి మృత్యుంజయుడిగా బయటపడిన బ్రిటిష్ జాతీయుడు విశ్వష్ కుమార్ రమేష్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. దేవుని దయతో బయటపడినట్లు మాట్లాడుకుంటున్నారు. విమానం ఎడవ వైపున ఎమర్జెన్సీ డోర్ వద్ద 11ఏ సీటులో కూర్చున్న రమేష్ ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

విమానం టేకాఫ్ అయిన తర్వాత కొద్దిసేపటికే విమానం కుప్పకూలిందని, ఈ ప్రమాదంలో తన సీటు విమాన శిథిలాలకు దూరంగా ఎగిరిపడిపోయిందని అతను చెప్పాడు. ఈ కారణంగానే విమానాన్ని మంటలు చుట్టుముట్టినప్పటికీ, రమేష్ మాత్రం సురక్షితంగా ప్రాణాలు కాపాడుకోగలిగాడు. ‘‘ విమానం రెండు ముక్కలైంది. నా సీటు బయటపడింది’’ అని అతడికి చికిత్స చేస్తున్న అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌లోని డాక్టర్లకు చెప్పాడు. తాను ప్రమాద సమయంలో విమానం నుంచి దూకలేదని, విమానం విచ్ఛిన్నమైనప్పుడు తన సీటుతో సహా బయటకు విసిరివేయబడ్డానని వైద్యులకు వెల్లడించారు. ఈ ప్రమాదంలో రమేష్‌కి స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇറാനിൽ സംഗീതോത്സവങ്ങളോടെ പ്രവാചകൻ മുഹമ്മദ് നബിയുടെ ജന്മദിനാഘോഷവും ഇസ്‌ലാമിക ഐക്യ വാരവും സംഘടിപ്പിച്ചു

ടെഹ്‌റാൻ: ഇറാനിൽ സംഗീതോത്സവങ്ങളോടെ പ്രവാചകൻ മുഹമ്മദ് നബിയുടെ ജന്മദിനാഘോഷവും ഇസ്‍ലാമിക ഐക്യ...

DMK: "மனக்கசப்புடன் இனியும் திமுகவில் தொடர முடியாது" – தோப்பு வெங்கடாசலம் சொல்வது என்ன?

அ.தி.மு.க முன்னாள் அமைச்சரும், தி.மு.க- வின் முன்னாள் ஈரோடு மத்திய மாவட்ட...

Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్, పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్...

ഖാര്‍ഗെ സംസാരിച്ച വേദി ശുദ്ധീകരിച്ച വിവാദം; കേസെടുക്കാന്‍ ആവശ്യപ്പെട്ട രാഹുല്‍ ഗാന്ധിക്കെതിരെ എസ്.സി-എസ്.ടി പ്രകാരം എഫ്.ഐ.ആര്‍

ഡെറാഡൂണ്‍: കോണ്‍ഗ്രസ് അധ്യക്ഷന്‍ മല്ലികാര്‍ജുന്‍ ഖാര്‍ഗെ സംസാരിച്ച വേദി ശുദ്ധീകരിച്ച സംഭവത്തില്‍...