30
April, 2026

A News 365Times Venture

30
Thursday
April, 2026

A News 365Times Venture

Ukraine War: ఇండియన్ ఫార్మా గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి..

Date:

Ukraine War: ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఫార్మాసూటికల్ కంపెనీ గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ విసయాన్ని భారతదేశంలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. రష్యా “ఉద్దేశపూర్వకంగా” ఉక్రెయిన్‌లోని భారతీయ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. ‘‘ ఈరోజు ఉక్రెయిన్ భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ కుసుమ్ గిడ్డంగిని రష్యా క్షిపణి దాడి చేసింది. భారతదేశంతో తమది ప్రత్యేక స్నేహం అని చెప్పుకుంటూనే, మాస్కో ఉద్దేశపూర్వకంగా భారతీయ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుంది. పిల్లలు, వృద్ధుల కోసం ఉద్దేశించబడిన మందుల్ని నాశనం చేసింది’’ అని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తెలిపింది.

Read Also: Annamayya District: 78 మందితో ఇంటర్‌ కాలేజీ ప్రారంభం.. ఫస్ట్ ఇయర్‌లో ఒక్కరే పాస్!

భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలోని కుసుమ్, ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ఫార్మా సంస్థల్లో ఒకటి. ఉక్రెయిన్‌కి ముందు బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్, రష్యన్ దాడులు కైవ్‌లోని ఒక ప్రధాన ఫార్మా గిడ్డంగిని ధ్వంసమైందని చెప్పారు. ఉక్రెయిన్ తమ ఇంధన మౌలిక సదుపాయాలపై ఐదు దాడులు చేసిందని, యూఎస్ మధ్యవర్తిత్వం వహించిన తాత్కాలిక నిషేధాన్ని ఉల్లంఘించిదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

തമിഴ്‌നാട്ടില്‍ സ്റ്റാലിന്‍ തുടരുമെന്ന് എക്‌സിറ്റ് പോളുകള്‍; 120 സീറ്റുമായി ടി.വി.കെ നിര്‍ണായക ശക്തിയാകുമെന്നും സര്‍വേ

  ചെന്നൈ: തമിഴ്‌നാട്ടില്‍ ഭരണകക്ഷിയായ സ്റ്റാലിന്റെ ഡി.എം.കെ ഭരണം തുടരുമെന്ന് പ്രവചിച്ച്...

பினராயி 3.0-க்கு `நோ' சொல்லுகிறதா கேரளம்? – தேர்தலுக்குப் பிந்தைய கருத்துக்கணிப்புகள் சொல்வதென்ன?

கேரள மாநிலத்தில் மொத்தம் உள்ள 140 சட்டசபை தொகுதிகளுக்கும் ஒரே கட்டமாக...

LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్రంలో అనుమతి లేని మరియు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (Layout...

ಮೈಸೂರು: ಅನುಮಾನಾಸ್ಪದ ಸ್ಥಳಗಳ ಮೇಲೆ ಅಬಕಾರಿ ದಾಳಿ.

ಮೈಸೂರು, ಏಪ್ರಿಲ್, 29,2026 (www.justkannada.in):  ಅಬಕಾರಿ ಇಲಾಖೆಯ ವತಿಯಿಂದ ಮೈಸೂರು...