13
February, 2025

A News 365Times Venture

13
Thursday
February, 2025

A News 365Times Venture

Modi-Trump: మోడీ-ట్రంప్ భేటీపై ఇరు దేశాలు ప్రయత్నాలు.. త్వరలోనే తేదీ ప్రకటన..

Date:

Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనపై ముందస్తు ఏర్పాటు జరుగుతున్నాయని ఈ రోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇరువురు నేతల భేటీపై రెండు దేశాలు కృషి చేస్తున్నట్లు తెలిపింది. ‘”భారతదేశం-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి అమెరికా పర్యటనకు ఇరు పక్షాలు కృషి చేస్తున్నాయి. పర్యటనకు సంబంధించిన నిర్దిష్ట తేదీలను తగిన సమయంలో ప్రకటిస్తారు” అని చెప్పింది.

Read Also: AP DGP: ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు.. వారిని మాత్రం విదిలి పెట్టం..

నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన్న ప్రపంచ అగ్రనేతల్లో ప్రధాని మోడీ ఒకరు. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో వైట్‌హౌజ్‌లో మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ట్రంప్ వచ్చిన తర్వాత సుంకాల పేరుతో పలు దేశాలను బెదిరిస్తున్నాడు. ఈ జాబితాలో ఇండియా కూడా ఉంది. ఇదే సమయంలో అమెరికా వీసాలు, అక్రమ వలసదారుల అంశంలో కూడా ఇండియాకు ప్రాధాన్యత అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మోడీ-ట్రంప్ పర్యటన కీలకంగా మారింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

IPL: RCB  ನೂತನ ಕ್ಯಾಪ್ಟನ್ ಆಗಿ ರಜತ್ ಪಟಿದಾರ್ ನೇಮಕ

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,13,2025 (www.justkannada.in): ಮುಂದಿನ ತಿಂಗಳಿನಿಂದ ಐಪಿಎಲ್ ಜ್ವರ ಶುರುವಾಗಲಿದ್ದು, ರಾಯಲ್...

കലൂര്‍ സ്റ്റേഡിയം അപകടം; 46 ദിവസങ്ങള്‍ക്ക് ശേഷം എം.എല്‍.എ ഉമാതോമസ് ആശുപത്രി വിട്ടു

കൊച്ചി: തൃക്കാക്കര എം.എല്‍.എ ഉമാതോമസ് ആശുപത്രി വിട്ടു. 46 ദിവസങ്ങള്‍ക്ക് ശേഷമാണ്...

மீண்டும் சர்ச்சையில் சிக்கிய மகா. அமைச்சர்; முதல் மனைவியை மறைத்த விவகாரத்தில் நீதிமன்றம் நோட்டீஸ்

மகாராஷ்டிரா சிவில் சப்ளை மற்றும் நுகர்வோர் பாதுகாப்புத்துறை அமைச்சராக இருப்பவர் தனஞ்சே...

Ambati Rambabu: వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు..

Ambati Rambabu: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎందుకు...