26
June, 2026

A News 365Times Venture

26
Friday
June, 2026

A News 365Times Venture

Kailash Mansarovar Yatra: ఇండియా చైనాల మధ్య కీలక ఒప్పందాలు.. మానసరోవర్ యాత్రకు ఓకే..

Date:

Kailash Mansarovar Yatra: భారత, చైనాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు రోజలు పాటు విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు జరిగాయి. దీనిలో వేసవిలో కైలాస్-మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ప్రస్తుత ఒప్పందాల ప్రకారం.. దీనికి సంబంధించిన విధానాలను సంబంధిత యంత్రాంగం చర్చిస్తోందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ప్రారంభించాలని సూత్రప్రాయ ఒప్పందం కుదిరింది.

Read Also: Nandamuri Balakrishna: బాలకృష్ణని ఘనంగా సన్మానించిన ‘అఖండ 2: తాండవం’ టీం

భారతదేశం, చైనా మధ్య విదేశాంగ కార్యదర్శి-ఉప విదేశాంగ మంత్రి సమావేశం కోసం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ రోజు బీజింగ్‌ని సందర్శించారు. చైనా నుంచి విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. సరిహద్దు నదులకు సంబంధించిన డేటాను అందించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

గతేడాది అక్టోబర్‌లో రష్యా కజాన్‌లో బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడీ, చైనా ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించుకోవాలని భావించాయి. బ్రిక్స్ సమావేశాలకు ముందు భారత్- చైనా సరిహద్దుల్లో తమ తమ బలగాలు వెనక్కి వెళ్లాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలిగింది. ఆ తర్వాత నుంచి ఇరు దేశాలు కూడా తమ సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు చర్చిస్తున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕೆಎಸ್‌ ಒಯುಗೆ ನೂತನ ಕುಲಪತಿಯಾಗಿ ಡಾ. ಜ್ಞಾನ ಪ್ರಕಾಶ್ ನೇಮಕ

ಮೈಸೂರು,ಜೂನ್,25,2026 (www.justkannada.in):  ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮುಕ್ತ ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯ (KSOU)ದ ನೂತನ...

മയക്കുമരുന്ന് വരുന്നത് അദാനി തുറമുഖങ്ങള്‍ വഴി; അവര്‍ക്കെതിരെ നടപടിയെടുക്കാന്‍ പറ്റാത്തവരാണ് തൂഫാന്‍ കൊണ്ടുവരുന്നതെന്ന് കെ. സഹദേവന്‍

കൊച്ചി: രാജ്യത്തേക്ക് മയക്കുമരുന്ന് കടന്നു വരുന്നത് ഗൗതം അദാനിയുടെ കീഴിലുള്ള തുറമുഖങ്ങള്‍...

வெனிசுலாவை உலுக்கிய இரட்டை பூகம்பம்; இடிந்து விழுந்த கட்டடங்கள்… கதறி அழும் மக்கள் | Photo Album

Venezuela Earthquakes: நிலநடுக்கத்தை போன் மூலம் முன்கூட்டியே அறியலாமா? கூகுள் தரும்...

YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఇచ్చిన మరో కీలక హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని...