8
June, 2026

A News 365Times Venture

8
Monday
June, 2026

A News 365Times Venture

Pawan Kalyan: డిప్యూటీ సీఎం అనే పదానికి పవన్ కళ్యాణ్ వన్నె తెచ్చారు!

Date:

డిప్యూటీ సీఎం అనే పదానికి జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వన్నెతెచ్చారు గానీ.. పవన్ గారికి డిప్యూటీ సీఎం పదవి వల్ల ప్రత్యేక చరిష్మా రాలేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల అంటున్నారు. గత సంవత్సరాల అనుభవంలో డిప్యూటీ సీఎంలుగా ఎవరున్నారో తనతో పాటు చాలామందికి తెలియని పరిస్థితి అని, ఈ రోజున దేశం మొత్తం ఏపీ డిప్యూటీ సీఎం గురించి చర్చిస్తున్నారన్నారు. ఇంతితై వటుడింతై వామన రూపంలో మహావిష్ణువు ఎదిగినట్టు.. పవన్ కళ్యాణ్ గారు మరింత ఎదుగుతున్నారని కిషోర్ గునుకుల పేర్కొన్నారు.

Also Read: Chaudhary Elephant Attack: ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి.. గజరాజుల జాడ కోసం గాలింపు!

కావలిలో జనసేన జెండా ఆవిష్కరణలో కిషోర్ గునుకుల పాల్గొన్నారు. కావలి నియోజకవర్గపు జనసేన ఇంచార్జ్ అలహరి సుధాకర్, దగదర్తి మండల ప్రెసిడెంట్ వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో తురిమెర్ల గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ‘తాగునీరు ప్రతి ఒక్కరి హక్కు అని ప్రశ్నించిన గొంతుక ఈ రోజు అందరికీ తాగు నీరందించే పనిలో ఉంది. పల్లెలు అభివృద్ధి పడాలంటే.. పల్లె నుంచి నగరానికి కనెక్టివిటీ రోడ్లు వేయాలని ప్రశ్నించిన గొంతుక ఈ రోజు తండాలకు సైతం రోడ్లు వేయిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. విశాఖ హుక్కు ఆంధ్రుడి హక్కు అని నినదించిన స్వరం ఈ రోజు ప్రైవేటీకరణ కాకుండా విశాఖ ఉక్కు కర్మాగారంకు కోట్ల రూపాయలు విడుదల చేయించి జాతికే గర్వకారణంగా నిలిచింది. వారి ఆశయ సాధనకు పనిచేస్తున్న జనసేన నాయకులు అందరూ కూడా జవాబు దారి కలిగి ఉన్నారని, ప్రజా సమస్యల పరిష్కార వారదులుగా పని చేస్తున్నారు’ అని కిషోర్ గునుకుల పేర్కొన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഷിഗെല്ല: ഈ വര്‍ഷം രോഗം ബാധിച്ചത് 85 പേര്‍ക്ക്; കഴിഞ്ഞ വര്‍ഷത്തേക്കാള്‍ ഇരട്ടിയോളം

  തിരുവനന്തപുരം: സംസ്ഥാനത്ത് ആശങ്കയായി ഷിഗെല്ല രോഗവ്യാപനം. കഴിഞ്ഞ വര്‍ഷത്തേക്കാള്‍ ഇരട്ടിയോളം...

"திமுக உடன் மார்க்சிஸ்ட் கம்யூனிஸ்ட் குரல் கொடுக்கும்; இதை எதிர்காலத்திலும் சொல்வேன்" – பெ.சண்முகம்

திமுக கூட்டணியில் இருந்து தான் கடந்தச் சட்டமனந்த் தேர்தலை சந்தித்தன விடுதலைச்...

Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జి‌ని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!

Bus Accident: ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని కొత్త లంకపల్లి రైల్వే...

പിസ വിതരണം ചെയ്യാന്‍ പോയ ഇന്ത്യന്‍ യുവാവ് വെടിയേറ്റ് കൊല്ലപ്പെട്ടു: യു.എസിലേക്ക് മക്കളെ അയക്കരുതെന്ന് സഹോദരി

ഫിലാഡല്‍ഫിയ: യു.എസിലെ ഫിലാഡല്‍ഫിയയില്‍ 28 വയസുള്ള ഇന്ത്യന്‍ യുവാവ് വെടിയേറ്റ് കൊല്ലപ്പെട്ടു....