15
February, 2025

A News 365Times Venture

15
Saturday
February, 2025

A News 365Times Venture

India-Bangladesh Border: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత..

Date:

India-Bangladesh Border: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. ముఖ్యం పాకిస్తాన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. మరోవైపు ఆ దేశంలోని మైనారిటీలు, ప్రధానం హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ఇక బంగ్లా మాజీ ఆర్మీ అధికారులు భారత్‌కి వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగారు.

Read Also: Rahul Gandhi: “కులగణన”తో బీహార్ ప్రజలను మోసం చేశాడు.. నితీష్‌పై రాహుల్ గాంధీ ఆరోపణ

దీనికి తోడు ఇటీవల భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల సరిహద్దు ప్రాంతంలో మన దేశంలో బీఎస్ఎఫ్ కంచె నిర్మిస్తుంటే, దీనికి బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్(BGB) అభ్యంతరం చెప్పింది. ఇది వివాదానికి కారణమైంది. తాజాగా, సరిహద్దుల్లో ఇరు దేశాల రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటన సుఖ్‌దేవ్ పూర్ సరిహద్దు అవుట్‌పోస్ట్ సమీపంలో జరిగింది.

అంతర్జాతీయ సరిహద్దు వద్ద పనిచేసుకుంటున్న భారత రైతులు, బంగ్లాదేశ్ రైతులు తమ పంటను దొంగిలించారని ఆరోపించారు. దీంతో ఇరు దేశాల సైనికులు సరిహద్దు వద్దకు చేరుకుని ఘర్షణ పడ్డారు. రెండు వైపుల భారీ సంఖ్యలో జనాలు గుమిగూడారు. తిట్టుకుంటూనే, రాళ్లదాడులకు పాల్పడ్డారు. సకాలంలో BSF మరియు BGB సిబ్బంది జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భారత రైతులు ప్రశాంతంగా ఉండాలని, సరిహద్దు వివాదాల్లో పాల్గొనవద్దని అభ్యర్థించినట్లు బీఎస్ఎఫ్ చెప్పింది. ఏదైనా ఫిర్యాదులు ఉంటే అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hey Chikittha : వాహ్.. పవన్ కళ్యాణ్ సాంగ్ పేరుతో సినిమా.. పోస్టర్‌లోనూ పవన్‌ కటౌట్..

బద్రికి సినిమా రిలీజ్‌ అయి 25 ఏళ్లైంది. పూరీ జగన్నాథ్...

ಸಹಜ ಸ್ಥಿತಿಯತ್ತ ಮರಳಿದ ಉದಯಗಿರಿ: ಇಂದು ಗೃಹಸಚಿವರಿಂದ ಭೇಟಿ

ಮೈಸೂರು,ಫೆಬ್ರವರಿ,14,2025 (www.justkannada.in): ಉದಯಗಿರಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆ ಮೇಲೆ ಕಲ್ಲು ತೂರಾಟ...

ആര്‍.രാജഗോപാല്‍ ദി ടെലഗ്രാഫിലെ എഡിറ്റര്‍ അറ്റ് ലാര്‍ജ് സ്ഥാനം രാജിവെച്ചു

കൊല്‍ക്കത്ത: പ്രമുഖ മാധ്യമ പ്രവര്‍ത്തകന്‍ ആര്‍.രാജഗോപാല്‍ ദി ടെലഗ്രാഫ് പത്രത്തിന്റെ എഡിറ്റര്‍...

பாலியல் புகாரில் IPS அதிகாரி சஸ்பெண்ட்: “குடும்பத்தை அவமானப்படுத்த நோக்கம்'' – DGP-யிடம் மனைவி மனு

சென்னையில் போக்குவரத்து இணை கமிஷனராகப் பணியாற்றி வரும் ஐ.பி.எஸ் அதிகாரி மகேஷ்குமார்...