11
September, 2026

A News 365Times Venture

11
Friday
September, 2026

A News 365Times Venture

Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్

Date:

గతేడాది దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎర్రకోట కారు పేలుడు కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కీలక వివరాలను వెల్లడించింది. ఈ దాడి వెనుక చాలా సంవత్సరాలుగా కుట్ర ఉందని పేర్కొంది. దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పలు సంచలన ఆరోపణలు చేసింది. పేలుడులో మరణించిన ఉమర్ ఉన్ నబీ ఈ కుట్రకు ప్రధాన సూత్రధారిగా పేర్కొంది. పునరుద్ధరించబడిన అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH) ఉగ్రవాద మాడ్యూల్‌కు “ఆపరేషనల్ ఇన్‌చార్జ్”గా వ్యవహరించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

కారే పేలుడు పరికరంగా మారిందా?

పేలుడుకు ఉపయోగించిన హ్యుందాయ్ i20 కారును వెహికల్-బోర్న్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ (VBIED)గా ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. 2025 నవంబర్ 10న సాయంత్రం సుమారు 6:50 గంటలకు ఎర్రకోట సమీపంలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా.. మరో 29 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఆస్తులు, వాహనాలు కూడా భారీగా దెబ్బతిన్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపింది. ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేసిన వైద్యుడు ఉమర్ ఉన్ నబీ, సహ నిందితుడు జాసిర్ బిలాల్ వానీ కలిసి కుట్రలో భాగంగా సెకండ్‌హ్యాండ్ కారును కొనుగోలు చేసినట్లు ఆరోపించింది. పేలుడు జరిగిన సమయంలో నబీ కారులోనే ఉన్నాడని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. పేలుడు స్థలం నుంచి సేకరించిన జీవ పదార్థాలపై నిర్వహించిన DNA పరీక్ష ద్వారా అతడి గుర్తింపును నిర్ధారించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.

పేలుడు పదార్థాల అవశేషాలు గుర్తింపు

ఫోరెన్సిక్ దర్యాప్తులో పేలుడు స్థలం నుంచి సేకరించిన పదార్థాల్లో TATP, అమ్మోనియం నైట్రేట్ సహా పేలుడు పదార్థాల అవశేషాలు గుర్తించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. వాహనం లోపల నుంచే కమాండ్ మెకానిజం ద్వారా పేలుడు పరికరాన్ని యాక్టివేట్ చేసినట్లు ఫోరెన్సిక్ ఆధారాలు సూచిస్తున్నాయని ఏజెన్సీ తెలిపింది.

రాకెట్ తయారీపై YouTube, ChatGPTలో సెర్చ్

సహ నిందితుడు జాసిర్ బిలాల్ వానీ రాకెట్ తయారు చేసే విధానాల కోసం YouTube, ChatGPTలను ఉపయోగించి సమాచారం వెతికినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అలాగే ఉమర్ ఉన్ నబీ అతడికి రెండు డ్రోన్లు అందించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ దాడి ఒక పెద్ద కుట్రలో భాగమని NIA ఆరోపించింది. AGuH మాడ్యూల్‌ను తిరిగి క్రియాశీలం చేయడం, కొత్త సభ్యులను రాడికలైజ్ చేయడం, ఉగ్రవాద చర్యలకు అవసరమైన సన్నాహాలు చేయడం వంటి అంశాలు ఈ కుట్రలో భాగమని పేర్కొంది. 2022 ప్రారంభం నుంచే నబీ నిద్రాణంగా ఉన్న AGuH మాడ్యూల్‌ను పునరుద్ధరించేందుకు, భారత్‌పై ఉగ్రవాద చర్యలకు పాల్పడేలా రాడికలైజ్ అయిన వ్యక్తులతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు పనిచేసినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది.

దర్యాప్తు ప్రకారం.. నబీ “ఆపరేషనల్ ఇన్‌చార్జ్”గా వ్యవహరించాడు. AGuH Interimగా పేర్కొన్న ఈ మాడ్యూల్‌ను భారత ఉపఖండంలోని అల్‌ఖైదా కార్యకలాపాల పునరుద్ధరిత రూపంగా దర్యాప్తు సంస్థ అభివర్ణించింది. నబీ కొత్త సభ్యులను రాడికలైజ్ చేయడం, రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడం, ఉగ్రవాద శిక్షణకు సహకరించడం, మాడ్యూల్‌కు అవసరమైన లాజిస్టిక్స్‌ను నిర్వహించడం వంటి కీలక పాత్రలు పోషించినట్లు ఆరోపించింది. నబీతో పాటు ఇతర సభ్యులు సాయుధ పోరాటం, హింసను ప్రోత్సహించే తీవ్రవాద సాహిత్యాన్ని కలిగి ఉండటంతో పాటు దాన్ని ఇతరులకు పంపిణీ చేసినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ సాహిత్యంలో హింసాత్మక తీవ్రవాదాన్ని సమర్థించే అంశాలతో పాటు సాయుధ పోరాటాన్ని మతపరమైన బాధ్యతగా చిత్రీకరించినట్లు NIA తెలిపింది. అదే విధంగా కార్యకలాపాల్లో రహస్యాన్ని పాటించడం, గుర్తింపును దాచడం, తప్పుడు పేర్లను ఉపయోగించడం, వివిధ రకాల ఉగ్రవాద దాడులకు సంబంధించిన సూచనలు కూడా ఆ మెటీరియల్‌లో ఉన్నట్లు ఆరోపించింది.

Signal ద్వారా సంప్రదింపులు

కుట్రలో భాగమైన నిందితులు Signal సహా ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా పరస్పరం సంప్రదింపులు కొనసాగించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. మాడ్యూల్ సభ్యులకు నిధులు సమకూర్చడం, అక్రమ ఆయుధాలు సేకరించడం, సభ్యులకు అవసరమైన ప్రదేశాలను ఏర్పాటు చేయడం, కుట్రకు సంబంధించిన వస్తువుల సమీకరణలో నబీ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది. జమ్మూ కశ్మీర్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో సమావేశాలు జరిగినట్లు.. అక్కడ సభ్యులకు శిక్షణ ఇచ్చి ఉగ్రవాద చర్యలకు సన్నాహాలు చేసినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

నబీ మృతితో అతడిపై విచారణ ముగింపు

పేలుడు ఘటనలో ఉమర్ ఉన్ నబీ మరణించడంతో అతడిపై ఉన్న న్యాయపరమైన చర్యలు అబేట్ అయ్యాయి. అయితే ఈ కుట్రలో అతడి పాత్రకు సంబంధించి దర్యాప్తులో వెల్లడైన ఆరోపణలను ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో వివరించింది. అయితే ఛార్జ్‌షీట్‌లోని ఆరోపణలు ఇంకా విచారణలో నిరూపించాల్సి ఉంది. తుది నిర్ణయం న్యాయస్థానం పరిశీలన, విచారణ అనంతరం వెలువడుతుంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘ചായ കുടിക്കാന്‍ പോയതല്ലല്ലോ’; ഇ.ഡി നടപടികള്‍ക്കിടെ പിണറായിയെ പരിഹസിച്ച് അലന്‍ ഷുഹൈബ്

കോഴിക്കോട്: സി.എം.ആര്‍.എല്‍ മാസപ്പടി കേസില്‍ പ്രതിപക്ഷ നേതാവ് പിണറായി വിജയന്‍, മകള്‍...

’வீட்டுக்கு அருகிலேயே தலைமைச் செயலகம் கட்டுவேன் என்ற பிடிவாதம் ஆபத்தில் முடியும்’–வானதி சீனிவாசன்!

பா.ஜ.க முன்னாள் தேசிய மகளிரணித் தலைவர் வானதி சீனிவாசன் வெளியிட்டுள்ள அறிக்கையில்,...

Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్‌ ఢీ.. 9 మంది మృతి

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు.....

സത്യ നികേതന്‍ ഹോസ്റ്റല്‍ അപകടം; നടത്തിപ്പുകാര്‍ക്ക് അപകട മുന്നറിയിപ്പ് നല്‍കിയിരുന്നതായി തൊഴിലാളി

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹി സത്യ നികേതനില്‍ ഹോസ്റ്റല്‍ കെട്ടിടം തകരുന്നതിന് മണിക്കൂറുകള്‍ക്ക് മുമ്പ്...