15
May, 2026

A News 365Times Venture

15
Friday
May, 2026

A News 365Times Venture

Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!

Date:

Dharmendra Pradhan: నీట్ (NEET UG) పరీక్షా పత్రాల లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన చేశారు. మే 3న జరిగిన పరీక్షలో “గెస్ పేపర్లు” అనే పేరుతో అసలు ప్రశ్నపత్రమే లీక్ అయిందని ప్రభుత్వం నిర్ధారించడంతో, ఆ పరీక్షను రద్దు చేసి జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను పాటించినప్పటికీ, కమాండ్ చైన్‌లో ఎక్కడో లోపం జరిగింది. దానికి తాము బాధ్యత వహిస్తున్నామని నిజాయితీగా అంగీకరించారు. గత ఏడాది నీట్ వివాదాల నేపథ్యంలో ఇస్రో మాజీ ఛైర్మన్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పరీక్షల సంస్కరణల కోసం సుమారు 95 కీలక సిఫార్సులు చేసింది. 2025, 2026 పరీక్షల కోసం ప్రభుత్వం కొన్ని రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ, ఈసారి కూడా లీకేజీ జరగడం గమనార్హం. మే 7వ తేదీ నాటికే గెస్ పేపర్లలోని ప్రశ్నలు అసలు ప్రశ్నపత్రంతో సరిపోలుతున్నాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి ఫిర్యాదులు అందాయి. ఉన్నత విద్యా శాఖ, కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్ర అధికారులతో కలిసి విచారణ జరపగా, మే 12 నాటికి పేపర్ లీక్ నిజమేనని తేలింది. ఈ నేపథ్యంలోనే నిజాయితీ గల విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ‘ఎడ్యుకేషన్ మాఫియా’ నెట్‌వర్క్‌ను అరికట్టేందుకు పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రధాన్ స్పష్టం చేశారు. ఇందులో ఎన్టీఏ అధికారుల ప్రమేయంపై విచారణను సీబీఐకి అప్పగించామని, ఆ సంస్థ ఈ కేసును అత్యంత పారదర్శకంగా విచారిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రీ-ఎగ్జామ్‌కు సంబంధించి ముఖ్యమైన విషయాలు..
లక్షలాది మంది విద్యార్థుల సౌకర్యార్థం జూన్ 21న జరగబోయే రీ-ఎగ్జామ్ కోసం ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థుల ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు ఈసారి తమకు నచ్చిన పరీక్షా కేంద్రాన్ని (City) ఎంచుకునే వెసులుబాటును కల్పించారు. దీనికోసం విద్యార్థులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పాత క్రెడెన్షియల్స్‌తోనే లాగిన్ అవ్వొచ్చు. కొత్త అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ నుంచి అధికారిక ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు, వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ప్రస్తుత పేపర్-పెన్ మోడ్ కాకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానానికి మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘ഇതുകൊണ്ടാണ് ഇവരെ കോമാളി നിലവാരത്തില്‍ കാണുന്നത്’; സ്ഥാനമേല്‍ക്കാത്ത സര്‍ക്കാര്‍ വാഗ്ദാനം പാലിക്കാന്‍ ആവശ്യപ്പടുന്ന മഹിളാ മോര്‍ച്ച സമരത്തെക്കുറിച്ച് വി.ടി. ബല്‍റാം

കൊച്ചി: അധികാരത്തിലെത്തിയാല്‍ കെ.എസ്.ആര്‍.ടി.സി. ബസ്സുകളില്‍ സ്ത്രീകള്‍ക്ക് യാത്ര സൗജന്യമാക്കുമെന്നതായിരുന്നു ഇത്തവണ നിയമസഭാ...

`எடப்பாடிதான் எங்கள் தலைவர்; மாற்றுக் கருத்து இல்லை’ – வேலுமணி அணியில் இருந்து தாவிய கே.சி.வீரமணி

அ.தி.மு.க இரண்டாகப் பிளவுப்பட்டுள்ள நிலையில், அந்தக் கட்சியின் முன்னாள் அமைச்சரும் தற்போதைய...

ಹಿಜಾಬ್ ವಿವಾದ: ವಿದ್ಯಾರ್ಥಿಗಳನ್ನು ಧಾರ್ಮಿಕವಾಗಿ ಇಬ್ಬಾಗ ಮಾಡುವ ಸಾಧ್ಯತೆ- ಹಿರಿಯ ವಕೀಲ ಅ.ಮ.ಭಾಸ್ಕರ್

ಮೈಸೂರು,ಮೇ,15,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದಲ್ಲಿ ಮತ್ತೆ ಹಿಜಾಬ್ ,ಕೇಸರಿ ಶಾಲಿನ ವಿವಾದ...

ചോദ്യപേപ്പര്‍ ചോര്‍ച്ച; നീറ്റ് പുനപരീക്ഷ ജൂണ്‍ 21ന്

ന്യൂദല്‍ഹി: രാജ്യത്തെ ഏറ്റവും വലിയ മെഡിക്കല്‍ എന്‍ഡ്രന്‍സ് പരീക്ഷയായ നീറ്റ് പുനപരീക്ഷ...