Jammu Kashmir: శ్రీనగర్ విమానాశ్రయంలో ఇద్దరు అమెరికన్ పౌరుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి సామాను నుంచి గార్మిన్ శాటిలైట్ ఫోన్ దొరికింది. ఎయిర్ పోర్ట్ అధికారులు వీరిని ప్రశ్నించారు, ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అమెరికా మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్ అనే వ్యక్తి లగేజీలో ఈ ఫోన్ లభించింది. విమానాశ్రయంలో సాధారణ భద్రతా తనిఖీల్లో ఇద్దరు పౌరుల్ని చెక్ చేయగా జీపీఎస్, శాటిలైట్ పరికరాలను కనుగొన్నారు. వీరిని ప్రశ్నించగా, సంతృప్తికర సమాధానాలు రాకపోవడంతో పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: PM Modi: లొంగిపోండి లేదంటే వదిలిపెట్టం.. టీఎంసీ గుండాలకు మోడీ ఫైనల్ వార్నింగ్..
జెఫ్రీ స్కాట్ మోంటానా నివాసి. పర్వతాలతో నిండి ఉండే ప్రాంతానికి చెందిన వాడు. అయితే, ఈ ఇద్దరు అమెరికన్ పౌరులు ఏ పని కోసం శ్రీనగర్ వచ్చారనే దానిపై, శాటిలైట్ ఫోన్ ఎందుకుంది అనే దానిపై విచారణ జరుగుతోంది. గతంలో కూడా చాలా మంది విదేశీయులు శాటిలైట్ ఫోన్తో పట్టుబడ్డారు. శాటిలైట్ ఫోన్లపై నిషేధం ఉందని తెలియని విదేశీయులు వీటిని భారత్ తీసుకుని వస్తున్నారు. అయితే, కాశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతంలో భద్రతా బలగాలు వీటిని తీవ్రంగా పరిగణిస్తాయి.
ఇరిడియం వంటి శాటిలైట్ ఫోన్లపై భారత్లో నిషేధం ఉంది. ఇలాంటివి తీసుకువస్తే ముందుగా ఎయిర్ పోర్ట్ కస్టమ్స్లో ముందుగానే తెలియజేయాలి. ఇదే కాకుండా DoT లైసెన్స్ కూడా అవసరం. లైసెన్స్ లేకుండా, ఫోన్ను స్వాధీనం చేసుకుంటారు. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రకారం, శాటిలైట్ ఫోన్ లేదా శాటిలైట్ GPS పరికరాన్ని కలిగి ఉండటానికి అనుమతి తీసుకోకపోతే, దానిని కూడా నేరంగా పరిగణించవచ్చు.





