Man Climbs Electricity Tower: ఉత్తరప్రదేశ్ రాష్టంలోని సోనభద్ర జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. భార్యను తీసుకెళ్లేందుకు అత్తింటికి వెళ్లిన యువకుడు, అత్తమామలు పంపించేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై విద్యుత్ టవర్పైకి ఎక్కి హంగామా సృష్టించాడు. దీనితో ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ ఘటన రాబర్ట్స్ గంజ్ కోత్వాలి పరిధిలోని ఛప్కా ప్రాంతంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. కర్మా థానా ప్రాంతానికి చెందిన విశ్రామ్ అనే యువకుడు తన భార్యను తీసుకెళ్లేందుకు అత్తింటికి వచ్చాడు. అయితే కుటుంబ విభేదాల కారణంగా భార్యను పంపించేందుకు అత్తింటి వారు నిరాకరించారు. దీంతో ఆగ్రహం చెందిన యువకుడు సంచలన నిర్ణయం తీసుకుని సమీపంలోని విద్యుత్ టవర్పైకి ఎక్కాడు.
Mega 158 : కృతికాదు అనశ్వర్ కాదు.. బాబీ సినిమాలో మెగా డాటర్ గా ఎవరంటే
యువకుడు టవర్పైకి ఎక్కిన విషయం తెలిసిన వెంటనే స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు గంటలపాటు ప్రయత్నించి యువకుడిని శాంతింపజేసి సురక్షితంగా కిందికి దించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అనంతరం యువకుడిని అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.





