12
March, 2026

A News 365Times Venture

12
Thursday
March, 2026

A News 365Times Venture

Sirish: క్షమించండి.. రామ్ చరణ్ అభిమానులకు శిరీష్ లేఖ!

Date:

Sirish: రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు సోదరుడు శిరీష్ మాట్లాడిన మాటలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. రామ్ చరణ్ అభిమానులందరూ ఈ విషయం మీద తీవ్రంగా ఫైర్ అవడమే కాక ఇదే చివరి హెచ్చరికంటూ ఒక లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో శిరీష్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన కూడా ఒక లేఖ విడుదల చేశారు. ఆయన రాసిన లేఖ యధాతధంగా

Read Also: India-US trade deal: అమెరికా ఒత్తిడికి తలొగ్గని భారత్.. వాణిజ్య ఒప్పందంలో ప్రతిష్టంభన..

అందరికి నమస్కారం.. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు… సోషల్ మీడియాలో అపార్థాలకు దారి తీసి.. దాని వలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది. “Game Changer” సినిమా కోసం మాకు “Global Star” రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ళ నుంచి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడాం.. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే.. క్షమించండి అని శిరీష్ రెడ్డి ఆ లేఖలో రాసుకొచ్చారు. ఇక, దిల్ రాజు- శిరీష్ నిర్మించిన తమ్ముడు సినిమా జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శిరీష్ మాట్లాడిన మాటలు రాంచరణ్ అభిమానులకు కోపం తెప్పించాయి. గేమ్ చేంజర్ డిజాస్టర్ అయిన తర్వాత శంకర్ కానీ రామ్ చరణ్ కానీ కనీసం ఫోన్ చేయలేదని శిరీష్ అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

LPG ಸಿಲಿಂಡರ್ ಕೊರತೆ: ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ಪ್ರತಿಧ್ವನಿ, ವಾಕ್ಸಮರ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,11,2026 (www.justkannada.in): ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಯುದ್ದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಸೇರಿ ದೇಶದ...

പ്രധാനമന്ത്രിയെ വിമര്‍ശിക്കുന്ന സോഷ്യല്‍ മീഡിയ പോസ്റ്റുകള്‍ക്ക് പൂട്ട്; ഉത്തരവിട്ട് കേന്ദ്രം

ന്യൂദല്‍ഹി: പ്രധാനമന്ത്രി നരേന്ദ്രമോദിയെയോ സര്‍ക്കാരിനെയോ വിമര്‍ശിക്കുന്നതോ പരിഹസിക്കുന്നതോ ആയ സോഷ്യല്‍ മീഡിയ...

திருச்சி: "விஞ்ஞான ரீதியான ஊழலுக்கு பெயர் போனது தான் தி.மு.க!" – பிரதமர் மோடி காட்டம்

தமிழகத்திற்கு இந்த ஆண்டில் இரண்டாவது முறையாக வருகை தந்துள்ளார் பிரதமர் மோடி....