21
June, 2026

A News 365Times Venture

21
Sunday
June, 2026

A News 365Times Venture

Neeraj Chopra: పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. ఫోటోలు వైరల్

Date:

భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా ఆదివారం వివాహం చేసుకున్నారు. అతను తన కుటుంబంతో కలిసి కనిపించిన వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నీరజ్ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్విట్టర్ లో పెళ్లి ఫోటోలను పోస్ట్ చేశారు. దానికి నీరజ్-హిమాని అని క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా.. “జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను” అని రాశారు.

Read Also: CM Chandrababu: ముఖ్యమంత్రి దావోస్‌కు పయనం.. ఆల్ ది బెస్ట్ చెప్పిన అధికారులు

పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాను జావెలిన్ త్రోలో ప్రపంచంలోనే అత్యుత్తమ పురుష అథ్లెట్‌గా అమెరికన్ మ్యాగజైన్ ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ 2024లో ప్రకటించింది. 2024 ఒలింపిక్ గేమ్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన నీరజ్.. కాలిఫోర్నియాకు చెందిన మ్యాగజైన్ 2024 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరాడు. నీరజ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ జావెలిన్ 92.97 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు.

Read Also: Sambhal violence: సంభాల్ హింసలో మరో 10 మంది అరెస్ట్.. దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం..

గతంలో నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. నీరజ్ పెళ్లి కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సోషల్ మీడియా నుంచి ఇంటర్వ్యూల వరకు పెళ్లి గురించి ప్రశ్నలు అడిగారు. అయితే పెళ్లిపై నీరజ్ ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. తాజాగా.. ఈరోజు పెళ్లి చేసుకుని తన అభిమానులను ఆశ్చర్యపరిచారు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കേരളത്തില്‍ മെഡിക്കല്‍ ടൂറിസത്തിന്റെ മറവില്‍ അന്താരാഷ്ട്ര അവയവക്കടത്ത്; രേഖകള്‍ പുറത്തുവിട്ട് ഇ.ഡി

കൊച്ചി: കേരളത്തില്‍ മെഡിക്കല്‍ ടൂറിസം കമ്പനിയുടെ മറവില്‍ വന്‍തോതില്‍ അവയവക്കടത്ത് നടത്തിവന്ന...

மாதப்படி வழக்கு: `மீண்டும் ஆஜராகுங்கள்'-பினராயி விஜயன் மகளுக்கு சம்மன் அனுப்பிய அமலாக்கத்துறை!

கேரள மாநிலம், கொச்சியைச் சேர்ந்த சி.எம்.ஆர்.எல் தனியார் நிறுவனம் மற்றும் சி.பி.எம்...

Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బోర్డుపై భారత్ స్కోర్ 900 పరుగులు..

శ్రీలంకలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏ...

ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಮೂಲಭೂತ ಸೌಕರ್ಯ ಕಾಮಗಾರಿಗಳ ಕೆಲಸ ಚುರುಕುಗೊಳಿಸಿ: ಡಿಸಿ ಲಕ್ಷ್ಮಿಕಾಂತ ರೆಡ್ಡಿ ಸೂಚನೆ

ಮೈಸೂರು, ಜೂನ್, 20,2026 (www.justkannada.in): ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಮೂಲಭೂತ ಸೌಕರ್ಯಗಳ  ಕಾಮಗಾರಿಗಳಿಗೆ...