17
August, 2026

A News 365Times Venture

17
Monday
August, 2026

A News 365Times Venture

AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్‌-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!

Date:

AP Assembly 2026 Four Day Session: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలపై బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్ అధ్యక్షత బీఏసీ సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం చంద్రబాబు సహా పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణు కుమార్ రాజు, జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలను మొత్తం నాలుగు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. 20వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సభా కార్యక్రమాల అజెండా, చర్చించాల్సిన అంశాలు, బిల్లులు, ఆర్డినెన్స్‌లపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

రేపు బీసీ రిజర్వేషన్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 9 ఆర్డినెన్స్‌లను బిల్లుల రూపంలో సభ ముందుకు తీసుకురావాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు ఎల్లుండి ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 వ్యవహారంపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. సమయంతో సంబంధం లేకుండా సభలో చర్చించాల్సిన అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించాలని బీఏసీలో నిర్ణయించినట్లు సమాచారం. ఇక అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 అక్రమాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్‌-1 తరహా స్కామ్‌ను చూడలేదని అన్నారు. ఈ వ్యవహారంలో ఎంతోమంది మెరిట్‌ విద్యార్థులు నష్టపోయారని సీఎం వ్యాఖ్యానించారు.

గ్రూప్‌-1 వ్యవహారంపై ఎల్లుండి అసెంబ్లీలో అన్ని విషయాలను చర్చిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వెలుగులోకి వచ్చిన ఆరోపణలు, అభ్యర్థులకు జరిగిన నష్టంపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. డీఎస్సీ అంశంపైనా సీఎం స్పందించారు. డీఎస్సీలో మహిళా ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉందని, వారు నిన్న జరిగిన కార్యక్రమంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని చెప్పారు. ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే పెద్ద సంఖ్యలో మహిళా టీచర్లు రోడ్డుపైకి వచ్చారని సీఎం వ్యాఖ్యానించారు.

డీఎస్సీతో పాటు ఆ నియామక ప్రక్రియతో మహిళా ఉపాధ్యాయులకు భావోద్వేగ అనుబంధం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఏర్పడటాన్ని సహించలేకే వారు ఆందోళనకు దిగారని అన్నారు. మొత్తంగా బీఏసీ నిర్ణయాలతో రానున్న నాలుగు రోజుల అసెంబ్లీ సమావేశాలు కీలకంగా మారాయి. బీసీ రిజర్వేషన్‌ నివేదిక, 9 ఆర్డినెన్స్‌లకు సంబంధించిన బిల్లులు, గ్రూప్‌-1 అక్రమాలు, డీఎస్సీ సహా పలు అంశాలపై సభలో వాడీవేడీ చర్చ జరిగే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇവര്‍ നെതന്യാഹു തോല്‍ക്കണമെന്ന് ആഹ്രഹിക്കുന്നു; ഇവരെ ജയിക്കാന്‍ അനുവദിക്കരുത്: മംദാനിക്കും എര്‍ദോഗാനുമെതിരെ നെതന്യാഹുവിന്റെ ബോര്‍ഡ്

ടെല്‍അവീവ്: വരാനിരിക്കുന്ന ഇസ്രഈല്‍ തെരഞ്ഞെടുപ്പിന് മുന്നോടിയായി ഇസ്രഈല്‍ പ്രധാനമന്ത്രി ബെഞ്ചമിന്‍ നെതന്യാഹുവിന്റെ...

VCK: கட்டுக்கடங்காத கூட்டம், தவெக கூட்டணி உறுதி, திருமா பேச்சு – தமிழ்த்தேசிய எழுச்சி மாநாடு Bytes

கள்ளக்குறிச்சி மாவட்டம் உளுந்தூர்பேட்டையில் இன்று விடுதலைச் சிறுத்தைகள் கட்சி சார்பில் தமிழ்த்தேசிய...

നിങ്ങള്‍ വേണമെങ്കില്‍ കേസെടുത്തോളൂ; പക്ഷേ സ്‌കൂളുകള്‍ ശരിയാക്കുന്നത് വരെ ഞങ്ങള്‍ പിന്മാറില്ല: രാജസ്ഥാന്‍ സര്‍ക്കാരിനെതിരെ സി.ജെ.പി

ന്യൂദല്‍ഹി: മുന്‍കൂര്‍ അനുമതിയില്ലാതെ സ്‌കൂള്‍ പരിസരത്ത് പുറത്ത് നിന്നുള്ളവരുടെ പ്രവേശനവും ഫോട്ടോഗ്രഫിയും...

'கேரளா அல்லா… இனி 'கேரளம்' ஆனு' – கேரளம் – பெயர் மாற்றத்திற்குக் காரணம் என்ன?

2024-ம் ஆண்டு ஜூன் மாதம், கேரள சட்டமன்றத்தில், அந்த மாநிலத்தின் பெயர்...