15
August, 2026

A News 365Times Venture

15
Saturday
August, 2026

A News 365Times Venture

Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Date:

Amaravati Farmers: అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భూములు ఇచ్చి నష్టపోయిన రైతులకు న్యాయం జరగాల్సిందేనని, వారి హక్కులకు భంగం కలిగితే కోర్టు జోక్యం చేసుకుంటుందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ల్యాండ్ పూలింగ్ విధానం, సంబంధిత చట్టాలపై రైతులకు అభ్యంతరాలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం సూచించింది. విస్తృత రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని న్యాయం చేస్తామని, రైతులకు దక్కాల్సిన పరిహారం వారికి చేరాల్సిందేనని పేర్కొంది.

ఇక, రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పక్షాన నిలుస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైతుల హక్కులకు భంగం కలిగితే తగిన దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘ഇനി ഇസ്‌ലാമിക് റിപ്പബ്ലിക് ഓഫ് ബ്രിട്ടന്‍’; ഉപരോധ ഭീഷണിക്കിടെ ബ്രിട്ടന്റെ പേരുമാറ്റി നെതന്യാഹു

  ലണ്ടന്‍: ബ്രിട്ടനെ ‘ഇസ്‌ലാമിക് റിപ്പബ്ലിക് ഓഫ് ബ്രിട്ടന്‍’ എന്ന് വിശേഷിപ്പിച്ച്...

"இவர்களை பார் கவுன்சிலில் சேர்க்க வேண்டாம்" – BCI உத்தரவு; CJI சூர்ய காந்த்தின் அதிரடி பதில்!

'கரப்பான்பூச்சி' - இந்தியாவின் தலைமை நீதிபதி சூர்ய காந்த் சொன்ன இந்த...

സിറിയ അടുത്ത യുദ്ധക്കളം, ഗസയേക്കാള്‍ ഭീകരമായിരിക്കും; യുദ്ധം അനിവാര്യമെന്ന് ഇസ്രഈല്‍ മന്ത്രി

ടെല്‍ അവീവ്: സിറിയയുമായുള്ള യുദ്ധം പൂര്‍ണമായും അനിവാര്യമാണെന്നും അത് ഗസയിലേതിനേക്കാള്‍ വലുതായിരിക്കുമെന്നും...

மீனவர்கள் கைது: `கடமைக்கு கடிதம்; ஒவ்வொரு விஷயத்திலும் இரட்டை வேடம்..!' – தவெக அரசை சாடும் உதயநிதி

ராமேஸ்வரம் மீனவர்கள் கைது செய்யப்பட்டதற்கு தவெக அரசு போதிய நடவடிக்கைகளை எடுக்கவில்லை...