6
August, 2026

A News 365Times Venture

6
Thursday
August, 2026

A News 365Times Venture

CM Chandrababu: తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వారే అనుభవిస్తున్నారు.. ఎప్పుడూ రెగ్రేట్ ఫీల్ అవ్వలేదు!

Date:

తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వారే అనుభవిస్తున్నారని, ఎప్పుడూ కూడా తాను రెగ్రేట్ ఫీల్ అవ్వలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆస్తుల పంపకం సరిగా జరగలేదన్నారు. 2019 తర్వాత రాష్ట్రం విధ్వంసానికి గురైందని, 2024లో కూటమి ప్రభుత్వం రాగానే బ్రాండ్ ఏపీని పునరుద్ధరించాం అని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఏమేం చెప్పామో అవన్నీ చేస్తున్నామని, 2025-26లో పది సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ 2047 తయారుచేశామని సీఎం చెప్పుకొచ్చారు. సీఎం ఈరోజు ఆర్థిక శాఖపై శ్వేత పత్రం విడుదల చేశారు.

‘ఆర్థిక శాఖలో రెండు సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం ఎలాంటి ఎఫర్ట్ పెట్టామనేది అందరికి తెలియాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితిలో ఇదొక చారిత్రాత్మక ప్రెసెంటేషన్. పాలన బాగుంటే ప్రజల మీద పెద్ద ప్రభావితం చేస్తుంది. నెగటివ్ గవర్నన్స్ ఉంటే నెగటివ్ ప్రభావం చేస్తుంది. 2024లో ఒక అఖండ విజయం సాధించాం. 2019-24లో విధ్వంస పాలన సాగింది. ప్రజలందరూ భయంతో బ్రతికారు. 1982 ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక విప్లవం.. 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చాయి. 2024లో ఊహించని విప్లవం.. ఒక బాధ్యతతో ఎప్పడికప్పుడు ప్రోగ్రెస్ ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాము’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.

‘2014లో బస్సులో ఉండి పరిపాలించాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రయాణించాల్సి వచ్చింది. తెలంగాణలో ఆస్తులన్నీ తెలుగు వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎక్కడా కూడా రెగ్రేట్ ఫీల్ అవ్వలేదు. 2014-19 లో ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మ్ంచుకోవాల్సిన పరిస్థితి లో ఉన్నాము. 2019 లో వచ్చిన పాలనకి ప్రజలు బయటకి రావటానికి భయపడ్డారు. రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయి, అభివృద్ధి కుంటుపడింది. 2024 ఎన్నికల్లో ఏవి చెప్పామో అవి చేస్తున్నాము. ఊపిరి పిల్చుకోలేని ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పటికి ఇచ్చిన మాట ప్రకారం డేట్స్ వారీగా అన్ని అమలు చేస్తున్నాము’ అని సీఎం తెలిపారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എല്ലാ പ്രവര്‍ത്തനവും ഉടന്‍ അവസാനിപ്പിക്കണം; ഫ്രെഷ് കട്ട് പൂട്ടാന്‍ ഉത്തരവിട്ട് മലിനീകരണ നിയന്ത്രണ ബോര്‍ഡ്

കോഴിക്കോട്: താമരശ്ശേരിയിലെ ഫ്രെഷ് കട്ട് അറവ് മാലിന്യ സംസ്‌കരണ സ്ഥാപനം അടച്ചു...

"வாய்க்கு வந்ததை எல்லாம் வாக்குறுதிகளாக அள்ளி வீசிவிட்டு, இப்போது..!"- பட்ஜெட் குறித்து சீமான்

"மக்களின் வாழ்க்கைத்தரத்தை உயர்த்தும் ஆக்கப்பூர்வத் திட்டங்களோ, மாநிலத்தின் நிதிச்சுமையைக் குறைக்கும் மாற்றுப்பொருளாதாரப்...

ಮೈಸೂರು: ಕಬಿನಿ ನೀರು ಕಲುಷಿತ; ಸರ್ಕಾರ ತಕ್ಷಣ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಿ: ‘ಸೇವ್ ಕಬಿನಿ’ ತಂಡ ಆಗ್ರಹ

ಮೈಸೂರು,ಆಗಸ್ಟ್,5,2026 (www.justkannada.in):  ಕಬಿನಿ ನದಿಗೆ ಎಚ್.ಡಿ.ಕೋಟೆ ಹಾಗೂ ಸರಗೂರು ಭಾಗಗಳಿಂದ...