పశ్చిమ బెంగాల్లో నేటి సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఓటింగ్ ఏప్రిల్ 23న ముగిసింది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. దాదాపు 93 శాతం ఓటింగ్ నమోదైంది. గత రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఇక మలి విడత పోలింగ్ బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.
ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది. రెండు పార్టీలు కూడా నువ్వా-నేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తున్నాయి. అయితే సాయంత్రంతో ప్రచారంతో ముగియడంతో సమయం తక్కువగా ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. చివరి సారిగా ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మొత్తం దేశం వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ఎన్నికలు ముగిశాయి. బుధవారంతో పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికలు ముగియనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.





