20
April, 2026

A News 365Times Venture

20
Monday
April, 2026

A News 365Times Venture

Airtel: యూజర్లకు షాకిచ్చిన ఎయిర్ టెల్.. ఆ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు

Date:

మీరు ఎయిర్ టెల్ నెట్ వర్క్ యూజ్ చేస్తున్నారా? అయితే మీకు బిగ్ షాక్.. ఎయిర్ టెల్ ఆ పాపులర్ ప్రిపేయిడ్ ప్లాన్ ధరను పెంచి షాకిచ్చింది. 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచింది. ఇప్పుడు, ఎయిర్‌టెల్ 84 రోజుల రీఛార్జ్ చేయించుకోవడానికి వినియోగదారులు రూ. 899 చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ. 859గా ఉండేది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 1.5 జీబీ డేటా లభించేది. దీని కోసం కంపెనీ ఇంతకుముందు రూ. 859 వసూలు చేయగా, ఇప్పుడు ఆ ధర రూ. 899కి పెరిగింది.

Also Read:​Inter Exam Fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు చెల్లింపు గడువు పెంపు..

ఈ 84 రోజుల ప్లాన్‌లో వినియోగదారులకు లభిస్తున్న ప్రయోజనాలను యథావిధిగా అందిస్తూ, కేవలం దాని ధరను మాత్రమే పెంచింది. ఎయిర్‌టెల్ ఈ 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో, వినియోగదారులకు లోకల్, ఎస్‌టిడి, రోమింగ్ నెట్‌వర్క్‌లపై అపరిమిత కాల్స్ లభిస్తున్నాయి. దీని ఆధారంగా, మొత్తం ప్లాన్‌లో 126 GB డేటా లభిస్తుంది. రోజుకు 100 SMSలు, 1.5 GB డేటా కూడా అందిస్తున్నారు. ప్లాన్‌లో రోజువారీ 1.5 GB డేటా పరిమితి అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి తగ్గుతుంది.

Also Read:సహజంగా పండిన పండ్లు vs కెమికల్ పండ్లు – ఎలా గుర్తించాలి?

84 రోజుల ప్లాన్ వినియోగదారులకు ఎయిర్‌టెల్ రివార్డ్స్‌లో భాగంగా 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ సబ్‌స్క్రిప్షన్, ఇన్‌కమింగ్ కాల్స్, SMSల కోసం స్పామ్ హెచ్చరికలు, నెలకు 30 రోజుల ఉచిత హలోట్యూన్స్‌ను కూడా అందిస్తుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അഞ്ചുവർഷം മന്ത്രിയായിരുന്നിട്ടും മുതലാളി രാജൻ അല്ലല്ലോ കൂലിപ്പണിക്കാരൻ രാജൻ എന്നല്ലേ വിളിച്ചത്; ആ വിളിയിൽ അഭിമാനം: കെ. രാജൻ

തൃശ്ശൂർ: വയനാട് ദുരന്ത ബാധിതർക്കുള്ള ടൗൺഷിപ്പിലെ വീടുകളിലൊന്നിൽ വിള്ളൽ കണ്ടെന്ന പരാതിയെ...

“வேட்பாளர்கள் முதல் வாக்குகள் வரை அனைத்தும் ஜாதி" – சாதி மதமற்றவன் சான்றிதழ் பெற்ற பார்த்திபன்

நடிகர் பார்த்திபன் ஹைதராபாத்தில் நடந்த நிகழ்ச்சி ஒன்றில் பேசும்போது தன்னை ஒரு...

ಡಿಸಿಎಂ ಡಿಕೆಶಿ ಭೇಟಿ, ಚರ್ಚಿಸಿದ ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ಸ್ಪಷ್ಟನೆ ನೀಡಿದ ಸಚಿವ ಸತೀಶ್ ಜಾರಕಿಹೊಳಿ

ಬೆಳಗಾವಿ,ಏಪ್ರಿಲ್,20,2026 (www.justkannada.in):  ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಅವರ ಭೇಟಿಯ ಹಿಂದೆ...

2027ല്‍ യു.പിയില്‍ സമാജ്‌വാദി പാര്‍ട്ടി അധികാരത്തിലെത്തും; കോണ്‍ഗ്രസ് സഖ്യം തുടരുമെന്ന് അഖിലേഷ് യാദവ്

ലഖ്നൗ: വരാനിരിക്കുന്ന 2027ലെ നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ ഉത്തര്‍പ്രദേശില്‍ സമാജ്‌വാദി പാര്‍ട്ടി വന്‍...