కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుతమైన స్పెల్ వేసి, రాజస్థాన్ రాయల్స్ను 155/9 పరుగులకే పరిమితం చేసిన వరుణ్ చక్రవర్తి బలమైన పునరాగమనం చేశాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారతీయ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. కేవలం 155 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత సాధించి, కుల్దీప్ యాదవ్ (160 ఇన్నింగ్స్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
టీ20లలో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారతీయ ఆటగాడు (ఒక ఇన్నింగ్స్లో)
అర్ష్దీప్ సింగ్ – 151
వరుణ్ చక్రవర్తి – 155
కులదీప్ యాదవ్ – 160
జయదేవ్ ఉనద్కత్ – 162
మహమ్మద్ షమీ – 165
వైభవ్ సూర్యవంశీని ఔట్ చేయడం ద్వారా చక్రవర్తి తన 200వ వికెట్ను సాధించాడు. వరుణ్ వేసిన మొదటి ఓవర్లోనే ఫ్లైటెడ్ డెలివరీతో బ్యాట్స్మన్ను బోల్తా కొట్టించాడు, డీప్ మిడ్వికెట్లో రమన్దీప్ సింగ్ క్యాచ్ పట్టాడు. చక్రవర్తి ఒకే స్పెల్లో వరుసగా రెండు ఓవర్లు వేసి 3/14తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి రాజస్థాన్ నడ్డీ విరిచాడు.





