19
April, 2026

A News 365Times Venture

19
Sunday
April, 2026

A News 365Times Venture

CM Revanth Reddy : సీఎం రేవంత్‌తో ఫిరాయించిన ఎమ్మెల్యేల భేటీ.. కడియం శ్రీహరి గైర్హాజరు

Date:

CM Revanth Reddy : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో జరిగిన ఈ చర్చలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ భేటీలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గైర్హాజరుకావడం హాట్ టాపిక్‌గా మారింది. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇటీవల నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షం చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసులు వెలువడ్డాయి. అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉండటంతో ఈ నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Lashkar Terror Activities: ఆపరేషన్ సింధూర్ శిథిలాలను కూల్చిన ఉగ్రవాదులు.. లష్కర్ ఎ తోయిబా ప్లాన్ ఏంటి!

స్పీకర్ ఆదేశాల మేరకు కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే వివరణ సమర్పించారు. కానీ ఎక్కువ మంది ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమావేశమవ్వడం వెనక రాజకీయ లెక్కలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది.  అయితే.. ఫిరాయించిన ఎమ్మెల్యేల జాబితాలో దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), అరెకపుడి గాంధీ (శేరిలింగంపల్లి), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవేళ్ల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్) హాజరయ్యారు. కానీ కడియం శ్రీహరి మాత్రం ఈ భేటీకి రాకపోవడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.

Nightmares: చెడ్డ, పీడ కలలతో బాధపడుతున్నారా? ఇది కూడా ఓ కారణం కావచ్చు..!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പോര്‍ച്ചുഗല്‍ സര്‍ക്കാരിന്റെ തൊഴില്‍ പരിഷ്‌ക്കരണത്തിനെതിരെ പ്രതിഷേധം; ലിസ്ബണില്‍ തെരുവിലിറങ്ങി പതിനായിരങ്ങള്‍

ലിസ്ബണ്‍: പോര്‍ച്ചുഗീസ് സര്‍ക്കാരിന്റെ പുതിയ തൊഴില്‍നിയമ പരിഷ്‌ക്കാരങ്ങള്‍ക്കെതിരെ ലിസ്ബണില്‍ പ്രതിഷേധ പ്രകടനം...

North Korea: రెచ్చిపోయిన ఉత్తర కొరియా.. గజగజ వణుకుతున్న పొరుగు దేశాలు!

North Korea: కొరియా ద్వీపకల్పంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. అంతర్జాతీయ...

ಏ.20 ರಂದು ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಮೈಸೂರು ಜಿಲ್ಲಾ ಪ್ರವಾಸ

ಮೈಸೂರು,ಏಪ್ರಿಲ್,18,2026 (www.justkannada.in):  ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಏಪ್ರಿಲ್ 20 ರಂದು ಮೈಸೂರು...