25
April, 2026

A News 365Times Venture

25
Saturday
April, 2026

A News 365Times Venture

PM Modi China Tour: ఏడేళ్ల తర్వాత తొలిసారి చైనాకు భారత ప్రధాని.. ఆగస్టు 31న జిన్‌పింగ్‌తో మోడీ భేటీ

Date:

PM Modi China Tour: ఆగస్టు 31వ తేదీన జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాలో పర్యటించబోతున్నారు. ఈ టూర్ ఇటీవలి కాలంలో, ముఖ్యంగా తూర్పు లడఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం, భారత్- చైనా మధ్య సంబంధాలలో ఒక కీలక మలుపుగా చెప్పుకోవాలి. నేటి సాయంత్రం రెండు రోజుల పర్యటన కోసం జపాన్ వెళ్తున్న మోడీ. ఆ తర్వాత ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు చైనా నగరమైన టియాంజిన్‌లో పర్యటిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read Also: Kamal Haasan: ట్రంప్ సుంకాలపై భారత్‌కు కమల్‌హాసన్ కీలక సూచనలు

అయితే, ఏడు సంవత్సరాల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనాకు వెళ్లడం ఇదే మొదటి పర్యటన అవుతుంది. ప్రాంతీయ, ప్రపంచ గతిశీలత అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఈ టూర్ కి ప్రాముఖ్యత సంతరించుకుంది. భారత్- అమెరికా నుంచి వాణిజ్య ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధాని మోడీ ఈ పర్యటనకు వెళ్లడం ఉత్కంఠ రేపుతుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందని భారత్ పై కక్షగట్టిన ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. దీంతో ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భారతదేశం వివిధ దేశాలతో కొత్త ఒప్పందాలను చేసుకుని.. తన వాణిజ్య సంబంధాలను మరింత మెరుగు పర్చుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. SCO శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొనడంతో భారతదేశం దౌత్యపరమైన అంశాలతో పాటు ఆర్థిక వ్యూహాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘അവന്റെ അസ്ഥികളെ പുഴുക്കള്‍ തിന്നുതീര്‍ത്തു’; വിശുദ്ധ ഫ്രാന്‍സിസ് സേവ്യറിനെതിരായ അധിക്ഷേപ പരാമര്‍ശത്തില്‍ വലതുപക്ഷ പ്രഭാഷകന്‍ അറസ്റ്റില്‍

പനാജി: വിശുദ്ധ ഫ്രാന്‍സിസ് സേവ്യറിനെതിരെ അധിക്ഷേപകരവും വര്‍ഗീയ വിദ്വേഷം വളര്‍ത്തുന്നതുമായ പരാമര്‍ശങ്ങള്‍...

இந்திய ரயில்வேயில் அதிரடி ஆட்குறைப்பு நடவடிக்கை; பராமரிப்புப் பணிகளில் தொய்வு ஏற்படுமா?

இந்திய ரயில்வே நிர்வாகம் தனது ஒட்டுமொத்த பணியாளர் எண்ணிக்கையில் 2 சதவீதத்தைக்...

Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ‘ఠాగూర్’ సినిమా ఒక మైలురాయి. అవినీతిపై పోరాడే...

SSLC ಫಲಿತಾಂಶದಲ್ಲಿ ಕಲ್ಬುರ್ಗಿಗೆ ಕೊನೇ ಸ್ಥಾನ: ಪ್ರಶ್ನಿಸಿದ್ದಕ್ಕೆ ಗರಂ ಆದ ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,25,2026 (www.justkannada.in):  ಕಳೆದ ಎರಡು ದಿನಗಳ ಹಿಂದಷ್ಟೆ ಎಸ್ ಎಸ್...