8
February, 2026

A News 365Times Venture

8
Sunday
February, 2026

A News 365Times Venture

Gyanesh kumar vs INDIA Bloc: ముదురుతున్న ఓట్ల చోరీ వివాదం.. సీఈసీపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు ప్లాన్

Date:

దేశ వ్యాప్తంగా ఓట్ల చోరీ వివాదం ముదురుతోంది. ఎన్నికల సంఘం-ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని ఆధారాలను కూడా రాహుల్‌గాంధీ చూపించారు. దీనికి కౌంటర్‌గా ఆదివారం ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించింది. సీఈసీ జ్ఞానేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఓట్ల చోరీపై ఆధారాలు చూపించాలని.. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తాజాగా సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌పై అభిశంసన తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఈసీని తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం ఉంటుుంది. కానీ ప్రతిపక్షాలకు పార్లమెంట్‌లో అంత బలం లేదు. ఈ నేపథ్యంలో అభిశంసన తీర్మానం పెడతారా? లేదా? అని తేలాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఈసీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ బీహార్‌లో యాత్ర చేపట్టారు. 16 రోజుల పాటు ఓటరు అధికార్ యాత్ర పేరుతో యాత్ర చేపట్టారు. తేజస్వి యాదవ్‌తో కలిసి రాష్ట్రంలో యాత్ర చేస్తున్నారు. బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఓట్లు దొంగిలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. త్వరలోనే బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. సమయం తక్కువగా ఉండడంతో దాడి తీవ్రతరం చేశారు. దేశమంతా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దొంగతనం జరుగుతుందని స్వరం పెంచారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ವ್ಯಂಗ್ಯಚಿತ್ರಗಳ ಮೊನಚನ್ನು ಉಳಿಸಿಕೊಳ್ಳೋಣ: ಜಿ ಎನ್ ಮೋಹನ್

  ಬೆಂಗಳೂರು: ಜನರ ಸಂಪಾದಕೀಯ ಎಂದೇ ಬಣ್ಣಿಸಲ್ಪಟ್ಟಿದ್ದ ವ್ಯಂಗ್ಯ ಚಿತ್ರಗಳು ತಮ್ಮ...

നൂറ് വര്‍ഷമെന്നത് ഒരു പ്രസ്ഥാനത്തെ സംബന്ധിച്ച് ചെറിയ കാര്യമല്ല; സമസ്തയെ പ്രശംസിച്ച് മുഖ്യമന്ത്രി

കാസര്‍ഗോഡ്: സമസ്ത കേരള ജംഇയ്യത്തുല്‍ ഉലമ കേരളത്തിന്റെ ബഹുജന പണ്ഡിത സഭയെന്ന്...

Cryptocurrency Tragedy: హైదరాబాద్ పాతబస్తీలో విషాదం.. క్రిప్టో నష్టాలతో యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్ పాతబస్తీలో క్రిప్టోకరెన్సీ రూపంలో మరో నిండు ప్రాణం బలైంది. వేగంగా...