24
April, 2026

A News 365Times Venture

24
Friday
April, 2026

A News 365Times Venture

Gyanesh kumar vs INDIA Bloc: ముదురుతున్న ఓట్ల చోరీ వివాదం.. సీఈసీపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు ప్లాన్

Date:

దేశ వ్యాప్తంగా ఓట్ల చోరీ వివాదం ముదురుతోంది. ఎన్నికల సంఘం-ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని ఆధారాలను కూడా రాహుల్‌గాంధీ చూపించారు. దీనికి కౌంటర్‌గా ఆదివారం ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించింది. సీఈసీ జ్ఞానేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఓట్ల చోరీపై ఆధారాలు చూపించాలని.. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తాజాగా సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌పై అభిశంసన తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఈసీని తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం ఉంటుుంది. కానీ ప్రతిపక్షాలకు పార్లమెంట్‌లో అంత బలం లేదు. ఈ నేపథ్యంలో అభిశంసన తీర్మానం పెడతారా? లేదా? అని తేలాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఈసీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ బీహార్‌లో యాత్ర చేపట్టారు. 16 రోజుల పాటు ఓటరు అధికార్ యాత్ర పేరుతో యాత్ర చేపట్టారు. తేజస్వి యాదవ్‌తో కలిసి రాష్ట్రంలో యాత్ర చేస్తున్నారు. బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఓట్లు దొంగిలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. త్వరలోనే బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. సమయం తక్కువగా ఉండడంతో దాడి తీవ్రతరం చేశారు. దేశమంతా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు దొంగతనం జరుగుతుందని స్వరం పెంచారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

"மாயாஜாலக் கணக்குகளை மக்கள் உடைத்து நொறுக்கியிருக்கிறார்கள்"- வாக்குப்பதிவு குறித்து தவெக விஜய்

தமிழகத்தில் இதுவரை இல்லாத அளவிற்கு வாக்கு சதவிகிதம் பதிவாகியிருக்கும் நிலையில் தவெக...

Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..

ప్రముఖ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా (Vi) ప్రస్తుతానికి రీఛార్జ్‌ ధరల...

ಮೇ 5ರ ನಂತರ ರಾಜ್ಯ ರಾಜಕಾರಣದಲ್ಲಿ ಕ್ರಾಂತಿ: ರಾಷ್ಟ್ರಪತಿ ಆಳ್ವಿಕೆ ಬರುತ್ತೆ- ಬಿಜೆಪಿ ಶಾಸಕ

ತುಮಕೂರು,ಏಪ್ರಿಲ್,24,2026 (www.justkannada.in) :  ಮೇ 5ರ ನಂತರ ರಾಜ್ಯ ರಾಜಕೀಯದಲ್ಲಿ...