18
April, 2026

A News 365Times Venture

18
Saturday
April, 2026

A News 365Times Venture

Cease Fire Violation : గుజరాత్‌లో పాకిస్థాన్ డ్రోన్లు.. రాష్ట్ర మంత్రి కీలక సూచనలు…

Date:

గుజరాత్‌లోని కచ్‌లో పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయని రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వీ అన్నారు. “కచ్ జిల్లాలో అనేక డ్రోన్లు కనిపించాయి. ఇప్పుడు పూర్తిగా బ్లాక్‌అవుట్ అమలు చేయబడింది. దయచేసి సురక్షితంగా ఉండండి, భయపడవద్దు” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా.. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ డ్రోన్స్ ప్రయోగిస్తోందని చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు.. ఈ దాడిని భద్రతా దళాలు ఇంకా ధృవీకరించలేదు.

READ MORE: Cease Fire Violation : పాకిస్థాన్ ప్రభుత్వం మాటను ఆదేశ ఆర్మీ వినడం లేదా?

కాగా.. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లో సరిహద్దు వెంబడి పాకిస్థాన్ రెచ్చగొట్టే కార్యకలాపాలు మరోసారి ముమ్మరం అయినట్లు సమాచారం. శనివారం రాత్రి, పాకిస్థాన్ అనేక ప్రాంతాల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించి భారీ షెల్లింగ్‌కు పాల్పడిందని తెలుస్తోంది. కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో అనుమానిత డ్రోన్ కారణంగా పేలుడు సంభవించిందని వార్తలు వస్తున్నాయి. అఖ్నూర్, రాజౌరి, ఆర్ఎస్ పురా అంతర్జాతీయ సరిహద్దులపై పాకిస్థాన్ ఫిరంగి కాల్పులు జరిపిందని.. బారాముల్లాలో డ్రోన్ దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. జమ్మూలోని పలన్‌వాలా సెక్టార్‌లో కూడా పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని తెలుస్తోంది. శ్రీనగర్‌లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇది కాకుండా.. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌కు పెద్ద సంఖ్యలో డ్రోన్‌లు వస్తున్నాయి. అయితే, రక్షణ వ్యవస్థ వాటిని నాశనం చేస్తోంది. రాజౌరి నుంచి కూడా కాల్పులు జరుగుతున్నట్లు నివేదికలు ఉన్నాయి.

Harsh Sanghvi

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വാല്‍പ്പാറ അപകടം: വിയോഗം നാടിനാകെ നികത്താനാവാത്ത നഷ്ടം, കുടുംബങ്ങളുടെ ദുഃഖത്തില്‍  പങ്കുചേരുന്നു; അനുശോചിച്ച് മുഖ്യമന്ത്രി

  തിരുവനന്തപുരം: വാല്‍പ്പാറയില്‍ മിനി വാന്‍ അപകടത്തില്‍പ്പെട്ട സംഭവത്തില്‍ അനുശോചനം രേഖപ്പെടുത്തി...

'டெல்லியை வீழ்த்தியது தமிழ்நாடு'- தொகுதி மறுவரையறை தோல்வி குறித்து ஸ்டாலின்

நாடாளுமன்ற சிறப்புக் கூட்டத்தின் முதல் நாளான நேற்று (ஏப்ரல்.17) மக்களவையில் 3...

Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

పిల్లలే రేపటి పౌరులు, వారి ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధ వారు ఆరోగ్యవంతమైన...

ಕರ್ನಾಟಕ ಲೋಕಾಯುಕ್ತದ ನಾಲ್ಕು ದಶಕಗಳ ಸಾರ್ಥಕ ಪಯಣ: ಏ.18 ರಂದು ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ರಮ

ಬೆಂಗಳೂರು, ಏಪ್ರಿಲ್ ,16 ,2026 (www.justkannada.in): ಭ್ರಷ್ಟಾಚಾರ ನಿರ್ಮೂಲನೆ ಮತ್ತು...