21
June, 2026

A News 365Times Venture

21
Sunday
June, 2026

A News 365Times Venture

Bhadradri Kothagudem: ఫారెస్ట్ అధికారుల అమానుష చర్య.. రైతు మోటారు బోరులో రాళ్ళు వేసిన వైనం

Date:

భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఫారెస్ట్ అధికారులు అమానుష చర్యకు పాల్పడ్డారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పట్ల కర్కశంగా వ్యవహరించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే.. లక్షలు వెచ్చించి మోటారు బోర్లు తవ్వుకున్న రైతులకు తీరని నష్టాన్ని కలిగించారు. చర్ల మండలం పులిగుండాల గ్రామంలో ఫారెస్ట్ అధికారులు మోటారు బోరులో రాళ్లు వేశారు. మీడియం లక్ష్మీ అనే గిరిజన మహిళ రైతు పంట పొలంలో వేసిన మోటారు బోరులో ఫారెస్ట్ బీట్ అధికారి రాళ్ళు వేశాడు. ఐటిడి పిఓ, జిల్లా కలెక్టర్ల అనుమతులు ఉన్నప్పటికీ బోర్లను తొలగించారు అటవీ శాఖ అధికారులు. అధికారుల తీరుపై రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:Rajamouli : రాజమౌళి రెమ్యునరేషన్ రూ.200 కోట్లు.. IMDB నివేదిక..

అటవీ శాఖ అమానుష చర్యలను నిరసిస్తూ భద్రాచలం చర్ల ప్రధాన రహదారిపై పులిగుండాల గ్రామస్తుల రాస్తారోకో నిర్వహించారు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య సంఘటన స్థలానికి చేరుకొని ఈ ఘటనకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రెండు కిలోమీటర్ల మేర ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వాహనదారులు. ఘటన స్థలానికి చేరుకున్న చర్ల సీఐ రాజు వర్మ, ఎస్ఐలు ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Uddhav Shiv Sena: ఉద్ధవ్‌పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..

Uddhav Shiv Sena: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన...

ಹುಬ್ಬಳ್ಳಿ, ಗದಗ ಬೈಪಾಸ್ ಮೂಲಕ ಗೋಲಗುಂಬಜ್ ಎಕ್ಸ್ ಪ್ರೆಸ್ ರೈಲು ಸಂಚಾರಕ್ಕೆ ಒಪ್ಪಿಗೆ- ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್

ಬೆಂಗಳೂರು,ಜೂನ್,20,2026 (www.justkannada.in): ಮೈಸೂರು- ಫಂಡರಾಪುರ ನಡುವೆ ಸಂಚರಿಸುವ ಗೋಲ್ ಗುಂಬಜ್...

കേരളത്തില്‍ മെഡിക്കല്‍ ടൂറിസത്തിന്റെ മറവില്‍ അന്താരാഷ്ട്ര അവയവക്കടത്ത്; രേഖകള്‍ പുറത്തുവിട്ട് ഇ.ഡി

കൊച്ചി: കേരളത്തില്‍ മെഡിക്കല്‍ ടൂറിസം കമ്പനിയുടെ മറവില്‍ വന്‍തോതില്‍ അവയവക്കടത്ത് നടത്തിവന്ന...

மாதப்படி வழக்கு: `மீண்டும் ஆஜராகுங்கள்'-பினராயி விஜயன் மகளுக்கு சம்மன் அனுப்பிய அமலாக்கத்துறை!

கேரள மாநிலம், கொச்சியைச் சேர்ந்த சி.எம்.ஆர்.எல் தனியார் நிறுவனம் மற்றும் சி.பி.எம்...